ట్విట్టర్ సారీ.. లెహ్, లడాఖ్ చైనాలో చూపిన యాప్.. భారతీయలు మనోభావాలు దెబ్బతీశాం...
సోషల్ మీడియా ట్విట్టర్ భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్పింది. లెహ్, లడాఖ్ ప్రాంతాలను ట్విట్టర్ ఇదివరకు చైనా భూభాగంలో చూపించింది. దీనిపై అప్పట్లో నిరసనలు వెల్లువెత్తాయి. సున్నితమైన ఈ అంశంపై భారతీయుల మనోభావాలు దెబ్బతీశామని ట్విట్టర్ పేర్కొన్నది. ఈ మేరకు ఇవాళ అపాలజీ చెప్పింది.
ఇదివరకు చూపిన భూభాగాన్ని మార్చుతామని ట్విట్టర్ తెలిపింది. ఈ నెల 30వ తేదీ వరకు సరిదిద్దుతామని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్కు తెలియజేసింది. ఈ విషయాన్ని పార్లమెంరీ ప్యానెల్ చైర్ పర్సన్ మీనాక్షి లేఖ తెలియజేశారు. ఇదివరకు జరిగిన తప్పిదంపై ట్విట్టర్ సారీ చెప్పిందని వివరించారు.
ఇదివరకు తప్పుగా చూపిన ప్రాంతానికి సంబంధించి చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియన్ కరియన్ సంతకం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ అఫిడవిట్ పరిశీలించామని లేఖి చెప్పారు. దానిని సరిచేస్తామని చెప్పడంతో అంగీకరించామని వివరించారు. అందుకోసం 30వ తేదీ వరకు సమయం కూడా ఇచ్చామని ఆమె తెలిపారు.