బీజేపీ గూటికి సింగ్వీ..? కోడై కూస్తున్న ట్వీట్టర్, సింధియా బాటలోనేనని.. గాసిప్స్పై రియాక్షన్...
కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింగ్వీ పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపలో చేరతారని సోషల్ మీడియా ట్వీట్టర్ కోడై కూస్తోంది. దీనిపై సింగ్వీ స్పందించారు. తనపై గాసిప్ ప్రచారం చేసినవారికి ధన్యవాదాలు తెలిపారు. మీ కేంద్రంగా తనను ఎంచుకోవడంపై సెటైరిక్గా సింగ్వీ రియాక్టయ్యారు. ఊహాగానాలు డేవిల్ రేడియో వంటివదని సింగ్వీ కోట్ చేశారు.
కరోనా కలవరం: కేవలం 4 రోజుల్లోనే 10వేల కేసులు నమోదు, 53వేలు దాటి..
ఫేమస్ లాయర్..
అభిషేక్
మను
సింగ్వీ
సీనియర్
కాంగ్రెస్
నేత.
పశ్చిమ
బెంగాల్
నుంచి
కాంగ్రెస్
పార్టీ
తరఫున
రాజ్యసభకు
ప్రాతినిధ్యం
వహిస్తున్నారు.
కాంగ్రెస్
పార్టీ
అధికార
ప్రతినిధిగా..
అధికార
బీజేపీ
విధానాలను
ఎండగడుతున్నారు.
కాంగ్రెస్
పార్టీ
సుప్రీంకోర్టులో
దాఖలు
చేసిన
పిటిషన్లలో
సింగ్వీ
వాదనలు
వినిపించారు.
బీజేపీ గూటికి..
సీనియర్ కాంగ్రెస్ నేత బీజేపీలో చేరతారని ట్వీట్టర్లో పోస్టులు వైరలయ్యాయి. దీంతో సింగ్వీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ పలుకుబడిని దెబ్బతీసేందుకు ఊహాగానాలు వినిపించాయని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. అయితే సుర్జేవాలా హోంమంత్రి అమిత్ షాతో టచ్లో ఉన్నారని ఊహాగానాలు వినిపించాయి. బీజేపీ పార్టీ చీఫ్ జేపీ నడ్డా ఉన్నప్పటికీ చేరికలపై అమిత్ షా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
Recommended Video
సింధియా మాదిరిగా..
ఇటీవల మధ్యప్రదేశ్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి మారింది. శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం బాధ్యతలు చేపట్టారు. మధ్యప్రదేశ్ సంక్షోభ సమయంలో ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించింది సింగ్వీ అనే ఆరోపణలు కూడా వినిపించాయి. కానీ దీనిని సింగ్వీ కొట్టిపారేశారు.