లాభాల బాటలో ట్విట్టర్ , అంచనాలను మించి లాభాల్లోకి , ఎందుకంటే?
ట్విట్టర్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆదాయాన్ని సంపాదించింది. ఆర్తికంగా నష్టాల్లో ఉన్న కంపెనీ కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కొనసాగిన ట్విట్టర్ నష్టాలను అధిగమించింది.
వాషింగ్టన్: ట్విట్టర్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆదాయాన్ని సంపాదించింది. ఆర్తికంగా నష్టాల్లో ఉన్న కంపెనీ కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కొనసాగిన ట్విట్టర్ నష్టాలను అధిగమించింది.
సామాజిక మాధ్యమంలో ట్విట్టర్ కు ఎంతో పేరుతోంది.అయితే కొన్ని క్వార్టర్లుగా కంపెనీ యూజర్లు బేస్ తగ్గి లాభాలు రాక నష్టాల బాటలో ఉంది ట్విట్టర్. ఈ కంపెనీని అమ్మాలని ప్రయత్నించింది.అయితే ఆర్థిక నష్టాలను తలకెత్తుకొనేందుకు ఏ కంపెనీ కూడ ఆసక్తని చూపలేదు.
ట్విట్టర్ లో తొలిసారిగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాబడుల్లో అంచనావేసి దానికంటే మెరుగ్గా ఉన్నట్టు బుధవారం నాడు ట్విట్టర్ ప్రకటించింది.
ఇది అంచనావేసిన దానికంటే ఏడు మిలియన్లు ఎక్కువని తెలిసింది. అదేవిధంగా గత క్వార్టర్ కంటే కూడ 9 మిలియన్లు ఎక్కువే.
అదే విధంగా కంపెనీ రెవిన్యూలు 548 మిలియన్ డాలర్లుగా ఉన్నాయని కంపెనీ సీఈఓ జాక్ డోర్సే ప్రకటించారు. ఒక్క షేర్ పై ఆర్జించే ఆదాయం కూడ 11 శాతం ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ రెండు వాల్ స్ట్రీట్ అంచనావేసిన దానికంటే ఎక్కువని తెలిసింది. అయితే ఒక్కో షేర్ పై ఈపీఎస్ 1 శాతం మాత్రమే ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
అదేవిధంగా రెవిన్యూలు కూడ 511.9 మిలియన్ డార్లుగానే ఉంటాయని తెలిపింది. వీరి అంచనాలను ట్విట్టర్ బీట్ చేసింది,. రోజువారీ వాడకం వరుసగా నాలుగో క్వార్టర్ లోనూ ఏడాది ఏడాదికి 14 శాతం పెంచుకొంది.
ట్వీట్లకు తేలికగా రిప్లై ఇవ్వడానికి సంభాషన కొనసాగించడానికి కంపెనీ పలు మార్పులు చేర్పులు చేపట్టినట్టు డోర్సే చెప్పారు. సెర్చింజన్ బ్రౌజ్ లైవ్ కంటెంట్ అందించే సామర్థ్యాన్ని పెంచినట్టు చెప్పారు.