ముందువరుసలో కూర్చుని నిద్రలోకి జారుకున్న సీఎం!
Recommended Video
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి వార్తల్లోకెక్కారు. మంగళవారం మడికేరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సమావేశం జరుగుతుండగానే నిద్రలోకి జారుకున్నారు.
Karnataka CM Siddaramaiah appears to have dozed off during Congress press conference in Bengaluru pic.twitter.com/tgKTgdNrt9
— ANI (@ANI) May 26, 2017
ముందు వరుసలో కూర్చుని ముఖ్యమంత్రి తూలుతూ నిద్రపోతున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో నెటిజన్లు ఊరుకుంటారా? వారి నచ్చిన విధంగా జోకులు వేస్తూ అందరితో పంచుకుంటున్నారు.
Rahul Gandhi to Congress - I'm your president now.
— Comical लोचा ® 👿 (@Comical_Locha) January 9, 2018
Will you all be loyal & follow what I do#Siddaramaiah - say no more my master ! pic.twitter.com/KsR3lgOBwS
'గుడ్ మార్నింగ్ సిద్ధరామయ్య.. ప్లీజ్ తొందరగా లేవండి' అని ఒకరు, 'పని వేళల్లో నిద్రపోయే అవకాశం కేవలం జపాన్లో మాత్రమే ఉంది' మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకొకరైతే మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బాటలో సిద్ధరామయ్య నడుస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంటులో రాహుల్ నిద్రిస్తున్న ఫొటోను సిద్ధరామయ్య ఫొటోకు జతచేసి ట్వీట్ చేశాడు.
ఇప్పుడే కాదు, గతంలోనూ పలు కార్యక్రమాల్లో సిద్ధరామయ్య ఇలాగే నిద్రపోయి వార్తల్లో నిలిచారు. 2017 మేలో కాంగ్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుండగా ఆయన ముందు వరుసలో కూర్చుని మరీ నిద్రపోవడం గమనార్హం.