మోడీ,మన్మోహన్, అద్వానీ.. ఈ ముగ్గురు ఏటీఎం ముందు నిలుచుంటే?
ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎల్.కె అద్వాని, ఆర్థికమంత్రి జైట్లీ వీరంతా ఏటీఎంల ముందు నిలబడటం నిజ జీవితంలో సాధ్యం కాదేమో గానీ.. నెట్టింట మాత్రం సాధ్యపడింది.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎల్.కె అద్వాని, ఆర్థికమంత్రి జైట్లీ వీరంతా ఏటీఎం ముందు క్యూ లైన్లో నిలుచుంటే? నిజ జీవితంలో ఇది సాధ్యపడకపోయినా.. నెట్టింట మాత్రం సాధ్యపడింది. నోట్ల రద్దు నేపథ్యంలో సోషల్ మీడియాలో పలు జోక్స్ విపరీతంగా హల్ చల్ చేస్తోన్న తరుణంలో.. ఈ నలుగురిని జోక్స్ లోకి లాగారు నెటిజెన్స్.
కాస్తంతా గంభీర ముఖాలతో వీరంతా క్యూ లైన్ లో నిలుచున్న ఫోటో ఒకటి క్రియేట్ చేసి నెటిజెన్స్ జోకులు పేల్చుతున్నారు. ఫోటోలో పీఎం మోడీ ముందువరుసలో ఉండగా.. ఆయన వెనుక మన్మోహన్ సింగ్, ఎల్.కె.అద్వానీ, అరుణ్ జైట్లీ నిలబడి ఉన్నారు. హోంమంత్రి రాజ్ నాథ్ ఈ నలుగురి పక్కన నిలుచున్నట్టు ఫోటోలో కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో ఈ ఫోటోపై పేలుతున్న జోక్స్:
'ఎస్.బి.ఐ క్యాషియర్ ఇది లంచ్ టైమ్ అని చెప్పాడేమో.. అందుకే మొహాలు అలా పెట్టారు'.
'ఎప్పటిలాగే కెమెరా ఎక్కడుందో మోడీకి మాత్రమే తెలుసు'.
PM, Ex-PM and Always expecting PM. pic.twitter.com/Wd3GQiMiuR
— The Viral Fever (@TheViralFever) December 13, 2016
-గడ్డంపై కామెంట్ చేసిన ఓ నెటిజెన్.. 'పూర్తి గడ్డం(మోడీ).. గడ్డం(మన్మోహన్).. గడ్డం లేదు(అద్వానీ).. గడ్డం మీసాలు రెండూ లేవు (జైట్లీ)..' అంటూ ఈ నలుగురిని ఉద్దేశించి కామెంట్ చేశాడు.