చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళను రెండో పెళ్లి చేసుకున్న తల్లి... విచిత్ర ప్రవర్తన.. శివుడు,శక్తి అంటూ కన్నబిడ్డలనే నరబలికి...

|
Google Oneindia TeluguNews

తమిళనాడులో ఓ విచిత్ర ఘటన వెలుగుచూసింది. రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో వెలుగుచూసిన సంఘటనను గుర్తుకు తెచ్చేలా ఈ సంఘటన కనిపిస్తోంది. మదనపల్లెలో శివ పూజ పేరుతో ఉన్నత విద్యావంతులైన ఇద్దరు తల్లిదండ్రులు కన్నబిడ్డలనే బలితీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడులోనూ ఓ తల్లి తన పిల్లలను శివుడు,శక్తి అని పిలుస్తూ వారిని నరబలి ఇచ్చేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఆమె బారి నుంచి తప్పించుకున్న పిల్లలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా పుంజైపులియంపట్టిలో రామలింగం (42),రంజిత(36) అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి 15 ఏళ్లు,6ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం నుంచి రామలింగం-రంజిత దంపతుల్లో చాలా మార్పు వచ్చింది. రామలింగం ఇందుమతి(32) అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరు భార్యలు,పిల్లలతో కలిసి స్థానిక రంగపాళయం రైల్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు.

మరో మహిళతో తల్లి రెండో పెళ్లి...

మరో మహిళతో తల్లి రెండో పెళ్లి...

రామలింగం రెండో పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే రంజిత కూడా రెండో పెళ్లి చేసుకుంది. అయితే ఆమె పెళ్లి చేసుకున్నది ఓ మహిళను. తన భర్త రెండో భార్య ఇందుమతికి స్నేహితురాలైన శశి(38) అనే మహిళను రంజిత రెండో వివాహం చేసుకుంది. శశి కూడా అదే ఇంట్లో వారితో పాటే ఉంటోంది. రెండో పెళ్లి తర్వాత రంజితలో విపరీతమైన మార్పు వచ్చింది. శశిని నాన్న అని పిలవాలని,తండ్రి రామలింగంను మామ అని పిలవాలని తన ఇద్దరు కుమారులను వేధించడం మొదలుపెట్టింది.

శివుడు శక్తి అంటూ నరబలికి...

శివుడు శక్తి అంటూ నరబలికి...

రంజిత తన ఇద్దరు పిల్లలను స్కూల్‌ కూడా మానేయించింది. తండ్రి చనిపోయాడని అబద్దం చెప్పి స్కూల్ నుంచి వారి టీసీలు తీసుకొచ్చింది. అప్పటినుంచి వారితో ఇంటి పనులన్నీ చేయిస్తోంది. ఏ చిన్న పొరపాటు చేసినా ఒళ్లంతా కారం పూసి చిత్రహింసలకు గురిచేస్తోంది. అంతేకాదు,కొన్నిసార్లు పురుగుల మందు తాగాలని ఒత్తిడి చేసింది. ఇటీవల తన ఇద్దరు కుమారులను రంజిత శివుడు,శక్తి అని పిలవడం మొదలుపెట్టింది. అంతేకాదు,ఆ ఇద్దరిని నరబలి ఇచ్చేందుకు సిద్దపడినట్లు తెలుస్తోంది. ఈ విషయం పసిగట్టిన ఇద్దరు కుమారులు ఇంట్లో నుంచి పారిపోయి తాత వద్దకు చేరుకున్నారు. తాత,నానమ్మలతో సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A strange incident has come to light in Tamil Nadu. The incident seems to be reminiscent of the incident that erupted two months ago in Madanapalle, Chittoor district in Andhra Pradesh. In Madanapalle, it is known that two highly educated parents sacrificed their children in the name of Shiva Puja. Recently in Tamil Nadu too, a mother calling her children Shiva and Shakti was tried to sacrifice them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X