ఇద్దరు అబ్బాయిలకు వివాహం, కారణమిదే!
మాండ్యా: అమ్మాయిలు వివాహం చేసుకొన్న ఘటనలు చూశాం. విన్నాం. కాని, ఇద్దరు అబ్బాయిలకు గ్రామస్థులు దగ్గరుండి వివాహం చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది. అయితే ఇద్దరు అబ్బాయిల్లో ఓ అబ్బాయిని అమ్మాయిని తయారు చేసి మరీ వివాహం జరిపించారు.
కర్ణాటక రాష్ట్రంలోని సాగర్, మహిత్ అనే ఇద్దరు అబ్బాయిలకు వివాహం చేశారు గ్రామస్థులు. ఇద్దరూ అబ్బాయిలకు గ్రామస్తులే దగ్గరుండి మరీ ఈ వివాహాన్ని చేశారు.
ఈ ఏడాది సమృద్దిగా వర్షాలు కురవాలని కోరుతూ ఈ వివాహన్ని చేశారు.మాండ్యా జిల్లాలోని కేఆర్ పేట తాలుకా సంతేబాచేహళ్ళి గ్రామంలో ఈ ఘటన శనివారం నాడు చోటుచేసుకొంది.
సాగర్ ను వరుడిగా, మహిత్ ను వధువుగా అలంకరించి గ్రామస్థులు సంప్రదాయరీతిలో ఘనంగా జరిపించారు. అయితే ఈ ఏడాదివర్షాలు కురవాలని కోరుతూ ఇద్దరు అబ్బాయిలకు గ్రామస్థులు వివాహం జరిపించారు.
అయితే మగ పిల్లలకు పెళ్ళితంతు నిర్వహించడం ఆనవాయితీగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని గ్రామపెద్దలు తెలిపారు.