వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ఎస్ పుర సెక్టార్‌లో పాక్ కాల్పులు: ఇద్దరి మృతి, నలుగురికి గాయాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్‌ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. భారత దళాలు పాక్ కాల్పులను తిప్పికొడుతున్నాయని అధికారులు ప్రకటించారు.

జమ్మూకాశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లో భారత జవాన్లపై పాక్‌ జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Two civilians killed, four injured in ceasefire violation by Pakistan in RS Pura sector of Jammu and Kashmir

కాగా భారత్‌లో సరిహద్దు వెంట పాకిస్తాన్‌ జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాను, మరో యువతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆర్‌ఎస్‌ పురా, ఆర్నియా, రామ్‌గఢ్‌ సెక్టార్లలోని భారత ఔట్‌ పోస్టులపై బుధవారం నుంచి పాక్‌ కాల్పులు ప్రారంభించిందని బీఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు.

ఈ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ 78వ బెటాలియన్‌కు చెందిన తమిళనాడు వాసి, హెడ్‌ కానిస్టేబుల్‌ సురేశ్‌ చనిపోయారు. సరిహద్దులో కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

English summary
The Pakistani troops on Friday once again resorted to unprovoked ceasefire violation along the Line of Control (LoC) in RS Pura sector of Jammu and Kashmir where two civilians were killed, and four injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X