రహస్యంగా లవర్తో డేటింగ్.. యువతిపై పోలీసుల గ్యాంగ్రేప్
ఇంట్లో వాళ్లకు చెప్పకుండా బాయ్ ఫ్రెండ్ తో కలసి సీక్రెట్ గా డేటింగ్ కు వెళ్లిన ఆమె ఊహించని ప్రమాదాన్ని కొనతెచ్చుకుంది. కాపాడాల్సిన పోలీసులే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. లవర్ చూస్తుండగానే ఆమె పోలీసులు అత్యాచారం జరిపారు. పుదుచ్చేరిలోని ప్రఖ్యాత టూరిస్టు కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సతీశ్ కుమార్, సురేశ్ అనే కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని కడలూరుకు చెందిన ఓ అమ్మాయి.. అదే ఊరికి చెందిన అబ్బాయితో కొంతకాలంగా ప్రేమలో ఉంది. వీకెండ్ కావడంతో ఇంట్లో వాళ్లకు అబద్ధం చెప్పి.. ఆ ఇద్దరూ పుదుచ్చేరి వెళ్లారు. అక్కడి బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఏకాతంగా గడపసాగారు. అదే బీచ్ లో గస్తీ విధులు నిర్వహిస్తోన్న సతీశ్, సురేశ్ లకు ప్రేమ జంట తారాసపడింది. రహస్యంగా వెంబడించిన పోలీసులు.. ఆ ప్రేమ జంట అద్దెకు దిగిన గదిని గుర్తించారు. చుట్టుపక్కల రూమ్స్ లోనూ ప్రేమజంటలే ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
ప్రేమికులు బస చేసిన గదులకు వెళ్లిన ఆ ఇద్దరు పోలీసులు.. బెదిరింపులకు దిగారు. ప్రేమ విషయాన్ని పెద్దలకు చెబుతామని, తమ దగ్గర సీక్రెట్ వీడియోలు కూడా ఉన్నాయని, వాటి ఆధారంగా కేసులు పెడతామని హడావుడి చేశారు. ఆ క్షణంలో ఏం చెయ్యాలో అర్థంకాక భయపడిపోయిన ప్రేమ జంట అప్పటికప్పుడు తమ దగ్గరున్న రూ.20 వేలను పోలీసులకు సమర్పించుకుంది. పక్కగదిలోనూ అచ్చం ఇలాగే..
రహస్యంగా పుదుచ్చేరికి వచ్చిన జంటపైనా కానిస్టేబుళ్లు జులుం ప్రదర్శించారు. రెండో జంట దగ్గర డబ్బులు లేకపోవడంతో పోలీసలను ఒక్కతీరుగా ప్రధేయపడ్డారు. కానీ ఎంతకీ వినిపించుకోకుండా, లవర్ కళ్ల ముందే యువతిపై ఆ ఇద్దరు పోలీసులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయాన్ని బయటికి చెబితే చంపేస్తామని పోలీసులు బెదిరించడంతో మిన్నకుండిపోయిన ఆ యువజంట.. తమిళనాడుకు వచ్చిన తర్వాత స్నేహితుల సాయంతో ఫిర్యాదుకు సిద్ధమైంది. డిపార్ట్ మెంట్ పరువుతీసే ఈ సంఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. ఇద్దరు కానిస్టేబుళ్లను వెంటనే సస్పెండ్ చేసి, ఘటనపై విచారణకు ఆదేశించారు.