కశ్మీర్లో మరోసారి కాల్పులకు తెగబడ్డ తీవ్రవాదులు..5గురు సీర్పీఎఫ్ జవాన్లు మృతి..5గురికి గాయాలు
జమ్ము కశ్మీర్లో మరోసారి తీవ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో సీఆర్పీఎఫ్కు చెందిన 5గురు సీర్పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడగా మరో అయిదుగురు కూడ కాల్పుల్లో గాయపడ్డారు.గాయపడ్డవారిలో అనంతనాగ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కూడ ఉన్నాడు.
దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని నిత్యం బిజిగా ఉండే కేపీ రోడ్లో పెట్రోలింగ్ చేస్తున్న సీఆర్పీఎఫ్ పోలీసులపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో సీర్ఫీఎఫ్కు చెందిన ఇద్దరు కానిస్టేబుల్ మృతి చెందారు. కాల్పుల్లో అనంతనాగ్ పోలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ అర్షద్ అహ్మద్తోపాటు మరో అయిదుగురు పౌరులు కూడ గాయపడ్డారు. కాగా గాయపడిన ఇన్స్పెక్టర్ను శ్రీనగర్లోని ఆసుపత్రికి తరలించారు. కాల్పుల్లో ఘటనలో ఓ తీవ్రవాది కూడ చనిపోయినట్టు పోలీసులు తెలిపారు.
కశ్మీర్ రిజియన్లో ప్రతి రోజుల కాల్పులు జరుగుతున్నాయి. సోమవారం కూడ భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. మరోవైపు గత అయిదు నెలలుగా 100మందికి పైగా తీవ్రవాదులను భద్రత దళాలు మట్టుబెట్టగా , పుల్వామా దాడిలో గాయపడిన 40 మందితోపాటు ఇప్పటి వరకు 55 మంది భద్రతా దళాలకు చెందిన పోలీసులు చనిపోయారు.