చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్ : 'అమిత్ షా పీఏకి ఫోన్ చేస్తాం... మత విద్వేషాలు రెచ్చగొడుతాం..' రచ్చ రచ్చ..

|
Google Oneindia TeluguNews

తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ పొలిటికల్ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ తిను బండారాల షాపు యజమానిని బెదిరింపులకు గురిచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీఏకి ఫోన్ చేస్తామని... మత విద్వేషాలు రెచ్చగొడుతామని షాకింగ్ కామెంట్స్ చేశారు. తిన్న ఫుడ్‌కి బిల్లు కట్టాలని ఆ షాపు యజమాని అడిగినందుకు ఇలా నోటికొచ్చినట్లు వాగడమే కాదు... నానా రచ్చ చేశారు. గత సోమవారం(జనవరి 11) రాత్రి చెన్నైలోని ట్రిప్లికేన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

చెన్నై పోలీసుల కథనం ప్రకారం... సోమవారం రాత్రి ట్రిప్లికేన్‌లోని ఓ తిను బండారాల షాపుకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నారు.అయితే బిల్లు కట్టకుండానే ఇద్దరూ వెళ్లిపోతుండటంతో షాపు యజమాని ఇదేంటని ప్రశ్నించాడు. బిల్లు కట్టమని కోరాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన ఆ ఇద్దరూ యజమానిపై ఆవేశంతో ఊగిపోయారు.మమ్మల్నే బిల్లు అడుగుతావా అంటూ రెచ్చిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీఏకి ఫోన్ చేస్తామని... అది మత విద్వేషాలకు దారితీయవచ్చునని బెదిరించారు.

అరెస్ట్ చేసిన పోలీసులు

అరెస్ట్ చేసిన పోలీసులు

షాపు యజమాని ఎంతగా బతిమాలినా ఆ ఇద్దరూ వినిపించుకోకపోవడంతో ఇక చేసేది లేక పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. ఆ ఇద్దరు మద్యం మత్తులోనే ఈ రచ్చ చేసినట్లు గుర్తించారు. ఓ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తులుగా వీరిని గుర్తించారు. అయితే ఆ వివరాలేవి వెల్లడి కాలేదు. షాపులో రచ్చకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్‌లలోనూ...

మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్‌లలోనూ...

ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సాగర్ పటేల్(19),శంకర్(29) అనే ఇద్దరు వ్యక్తులు ఓ రెస్టారెంట్‌కు నిప్పంటించారు. రెస్టారెంటులో చికెన్ ఐటెమ్స్ లేవని చెప్పడంతో కోపోద్రిక్తులైన ఇద్దరు ఈ దాడికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఈతాహ్‌లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. వేడిగా లేని చపాతీలు పెట్టారన్న కోపంతో ఓ కస్టమర్ రెస్టారెంట్ యజమానిపై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో అతని కాలికి తీవ్ర గాయాలయ్యాయి.

English summary
In a shocking incident reported from the capital of poll-bound Tamil Nadu, two functionaries of a political party allegedly threatened to call Union Home Minister Amit Shah’s personal assistant (PA) after being asked to pay for the food they ordered at an eatery in the city’s Triplicane locality late Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X