వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు దళిత బాలికలు మృతి.. మరొకరు సీరియస్.. పొలంలో విగతజీవులుగా...

|
Google Oneindia TeluguNews

ఉన్నావ్.. మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ సారి ఇద్దరు దళిత బాలిక మృతి చెందారని స్థానిక మీడియా తెలిపింది. ముగ్గురు బాలికలకు పొలానికి వెళ్లి తిరిగి రాలేదు. వారిలో ఇద్దరూ చనిపోగా.. మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. చనిపోయిన ఇద్దరిపై గాయపడ్డ గుర్తులు కనిపించాయి.

 Two Dalits girls found dead in field in UPs Unnao

అశోహ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బాబురా గ్రామంలో ఘటన జరిగింది. పశువులకు గడ్డి (దాణా) తీసుకొచ్చేందుకు వారు పంట చేలకు వెళ్లారు. అక్కడ వారిపై దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆస్పత్రి వద్దకు కలెక్టర్, ఇతర అధికారులు చేరుకున్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు లక్నో నుంచి ఘటనా స్థలానికి ఐజీ, డీఐజీ వెళ్లారు.

పొలాల్లో ఆ ముగ్గురు సృహ కోల్పోయి కనిపించారు. వారిలో ఒకరి సోదరుడు జరిగిన ఘటనను మీడియాకు వివరించారు. తన సోదరి మధ్యాహ్నం 3 గంటలకు పశుగ్రాసం కోసం వెళ్లిందని.. సాయంత్రం అయినా తిరిగి రాలేదని చెప్పారు. దీంతో తాము వెతకడం ప్రారంభించామని తెలిపారు. వారిలో ఇద్దరు చనిపోయారని తెలిసిందని చెప్పారు. తమకు ఎవరితో శత్రుత్వం లేదని.. ఎవరిపై అనుమానం లేదని తెలిపారు.

English summary
Two minor girls were found dead in Unnao district of Uttar Pradesh while another is critical. Initial examination by doctors and police suggest the two girls were poisoned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X