వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ లో రెండు ఎన్ కౌంటర్లు: ఆరుగురు ఉగ్రవాదులు అంతం

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: శ్రీనగర్ లో రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. ఆరుగురు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో అంతం అయ్యారు. నలుగురు ఉగ్రవాదులను అంతం చేసిన సైనికుడు వీరమరణం పొందాడు. సాటి సైనికులను కాపాడేందుకు ప్రయత్నించి బుల్లెట్ గాయాలు కావడంతో ఆయన మరణించారు.

హంగ్ పంద్ దాదా (36) అనే ఆయన కాశ్మీర్ లో జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు. కుప్వారా జిల్లా లోని నౌగమ్ సెక్టార్ లోని ఎల్ ఓసీ ప్రాంతంలో ఉగ్రవాదులు పాక్ అక్రమిత కాశ్మీర్ నుంచి భారత్ లోకి చోరబడుతున్నారని సైనికులకు సమాచారం వచ్చింది.

Two encounters in Jammu and Kashmir

వెంటనే సైనికులు అప్రమత్తం అయ్యారు. ఉగ్రవాదుల కదలికలను పసిగట్టిన భద్రతా దళాలు వారి మీద కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు అంతం అయ్యారు. నలుగురిని హంగ్ పంద్ దాదానే అంతం చేశారు.

ఉగ్రవాదులు జరిపిన ఎదురు కాల్పుల్లో తీవ్రగాయాలైన హంగ్ పంద్ దాదా వీరమణం పొందాడని అధికారులు తెలిపారు. బారాముల్లా జిల్లా తంగ్ మార్ లో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు అంతం అయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులు అంతం అయ్యారని, ఆ ఇద్దరు ఉగ్రవాదులు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులని ఆర్మీ అధికారులు తెలిపారు.

English summary
The army said four heavily armed terrorists were killed after troops foiled a major infiltration bid near the line of control in Nowgam sector of Kupwara district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X