వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూకాశ్మీర్‌లో భారీ హిమపాతం: ఇద్దరు విదేశీయులు మృతి

జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత స్కీ రిసార్ట్‌లోని గుల్‌మార్గ్‌లో పర్యాటకుల సమూహంపై భారీ హిమపాతం ఒక్కసారిగా వచ్చి పడటంతో.. ఇద్దరు విదేశీయులు(పోలిష్‌) మరణించారు.

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత స్కీ రిసార్ట్‌లోని గుల్‌మార్గ్‌లో పర్యాటకుల సమూహంపై భారీ హిమపాతం ఒక్కసారిగా వచ్చి పడటంతో.. ఇద్దరు విదేశీయులు(పోలిష్‌) మరణించారు. మరో 21 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ మధ్యాహ్నం హిమపాతం కారణంగా అఫర్వాత్ శిఖరం ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన వీడయోలు వైరల్‌గా మారాయి.ఈ వీడియోలో సందర్శకులపై మంచు హిమపాతం ఒక్కసారిగా వారిమీద పడింది.

Two foreigners killed In Massive Avalanche Strikes Gulmarg,J&K; Rescue Operation Underway

హిమపాతం కారణంగా మరణించిన ఇద్దరు విదేశీయులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మరణించినవారు విదేశీయులు కావడంతో చట్ట ప్రకారం తదుపరి కార్యక్రమాలుంటాయన్నారు. మరో 19 మంది విదేశీ పర్యాటకులను కాపాడామని బారాముల్లా పోలీసులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

'బుధవారం ఉదయం 21 మంది విదేశీ పౌరులు, 2 స్థానిక గైడ్‌లతో కూడిన 3 బృందాలు స్కీయింగ్ కోసం అఫర్వాత్ గుల్మార్గ్‌కు వెళ్లాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు హపత్‌ఖుద్ కాంగ్డోరిలో భారీ హిమపాతం సంభవించింది, అక్కడ ఈ స్కీయింగ్ బృందాలు చిక్కుకున్నాయి' అని పోలీసులు వెల్లడించారు.

కాగా, గత కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్‌లో మంచు తీవ్రంగా కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో విదేశీయు పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు. అయితే, ఒక్కసారిగా వచ్చే హిమపాతాలు విషాద ఘటనలను మిగుల్చుతున్నాయి.

English summary
Two foreigners killed In Massive Avalanche Strikes Gulmarg,J&K; Rescue Operation Underway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X