ఇప్పుడిదే ట్రెండ్ : అమ్మాయిలిద్దరూ ఒక్కటయ్యారు
వారణాసి : అమ్మాయి అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం కామన్. కానీ సేమ్ సెక్స్ మ్యారేజ్లు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఇద్దరమ్మాయిలు పెళ్లితో ఒక్కటయ్యారు. స్థానిక ఆలయంతో సంప్రదాయబద్ధంగా ఈ తంతు పూర్తి చేసుకున్నారు. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం చూసి అవాక్కైన భక్తులు ఈ తతంగాన్నంతా తమ సెల్ఫోన్లలో బంధించారు. ఆ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
యూపీ వారణాసిలోని మోహన్సరాయ్ ప్రాంతంలోని శివాలయం ప్రాంతం. జీన్స్, టీషర్ట్ వేసుకుని ఆటోలో వచ్చిన ఇద్దరు యువతులు ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పూజరి వద్దకు వెళ్లి ఏదో విషయం మాట్లాడారు. వెంటనే తమ దగ్గరున్న చున్నీలు కప్పుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. తొలుత ఆ ఇద్దరు అమ్మాయిల పెళ్లికి నిరాకరించిన పూజారి ఆ తర్వాత ఒప్పుకున్నారు. శాస్త్రోక్తంగా వివాహ తంతు పూర్తి చేశారు. వధూవరుల మాదిరిగా ఆ ఇద్దరు అమ్మాయిలు దండలు మార్చుకున్నారు. ఒక యువతి మరో అమ్మాయి మెడలో తాళి కూడా కట్టింది.
పెళ్లి తంతు పూర్తైన అనంతరం పూజారికి దక్షిణ సమర్పించుకున్న ఆ ఇద్దరూ వచ్చిన ఆటోలోనే తిరిగి వెళ్లిపోయారు. ఈ వింత పెళ్లిని గుడికి వచ్చిన భక్తులు తమ సెల్ఫోన్లలో బంధించారు. ఆలయ పూజరి చెప్పిన వివరాల ప్రకారం ఇద్దరు యువతుల్లో ఒకరిది వారణాసి కాగా.. మరొకరది కాన్ఫూర్. వాళ్లిద్దరూ సుందర్పూర్లో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి రావడంతో యువతులిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు.
టిక్టాక్ పిచ్చి : బ్రిడ్జిపైకి ఎక్కి.. నదిలోకి దూకి..