కసితీరా చంపి.. శవంతో కామవాంఛ తీర్చుకున్నారు.. యువకుడిపై ఇద్దరి అఘాయిత్యం..
ముగ్గురూ కలిసి ఫుల్లుగా మందుతాగారు.. ఆ మత్తులో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థంకానిస్థితికి దిగజారారు.. పచ్చి బూతుమాటలు తిట్టుకున్నారు.. నీదెంత? అంటే నాదింత! అని.. నువ్వు ఆ టైప్ కాకుంటే విప్పి చూపించమని.. నానారకాల లైంగిక పరిభాషలో వాదులాడుకున్నారు.. మాటా మాట పెరిగింది.. మెదడు ఉన్మాద స్థితికి చేరింది.. అంతే.. ఇద్దరు కలిసి.. మూడోవాణ్ని కసితీరా గొంతుపిసికి చంపి.. ఆ శవంతో కామదాహం తీర్చుకున్నారు.. గంటలపాటు ఆ గదిలో వికృతం తాండవం చేసింది..
అనుకోకుండా కలిసి..
బతకడానికి నగరాలకొచ్చే వలసదారులకు ఎన్నెన్నో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాటిలో ఎవరు మంచోళ్లో, ఎవరు క్రిమినల్సో కనిపెట్టడం కొంచెం కష్టమే. అందుకే కొత్తవాళ్ల పట్ల జాగ్రత్తంగా ఉండాలంటూ అన్ని ప్రముఖ సిటీల్లో పోలీసులు చాటింపు వేస్తుంటారు. అయినాకూడా అనుకోనిరీతిలో పరిచయమైనవాళ్ల చేతుల్లో కొందరు అమాయకులు బలైపోతూనేఉంటారు. దేశరాజధాని ఢిల్లీలో అలాంటిదే ఓ సంఘటన జరిగింది. ముగ్గురు వలస జీవులకు కొద్ది రోజుల కిందట ఏర్పడ్డ పరిచయం.. చివరికి హత్యకు దారితీసింది. దీనికి సంబంధించి సౌత్ ఢిల్లీ డీసీపీ అతుల్ కుమార్ ఠాకూర్ గురువారం మీడియాకు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
ఆ ముగ్గురి మధ్య ఏదో..
వలసదారుడైన ఓ యువకుడు కొన్నేళ్లుగా ఈస్ట్ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఉంటూ పనులు చేసుకుని జీవించేవాడు. అతని రూమ్ కు దగ్గర్లోనే సోదరి కూడా నివాసముంటోంది. ఈ మధ్యే అతనికి.. బీహార్, జార్ఖండ్ నుంచి వలసొచ్చిన ఇద్దరు వ్యాక్తులు పరిచయం అయ్యారు. వేర్వేరు చోట్ల పనులు చేసుకుంటూ.. అప్పుడప్పుడూ సాయంత్రాలు కలిసి మందు తాగేవాళ్లు. ఆ ముగ్గురి మధ్య ఏదో విచిత్రమైన దగ్గరి తనం కనిపించేదని తర్వాత వెల్లడైంది. తరచూలాగే మొన్న మంగళవారం యువకుడి ఇంట్లో ముగ్గురూ మందు పార్టీ చేసుకున్నారు..
గదిలో ఈ సీన్ చూసి..
మత్తెక్కిన తర్వాత మాటామాటా పెరిగడంతో ఉన్మాదులుగా మారిని ఇద్దరు వ్యక్తులు.. యువకుడిని చంపేసి, అతని శవంతో అసహజ పద్ధతిలో సెక్స్ చేశారు. మత్తుదిగిన తర్వాత శవాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. తర్వాతి రోజు మళ్లీ వచ్చి.. శవాన్ని మాయం చేయడానికి ప్రయత్నించారు. మృతదేహాన్ని బస్తాలో కుక్కుతుండగా.. సడెన్ గా మృతుడి సోదరి అక్కడికొచ్చి.. గదిలో సీన్ చూసి కేకలు వేవసింది. దీంతో ఆ కామాంధులిద్దరూ పరారయ్యారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు..
Recommended Video
నేరాంగీకారం..
హత్య జరిగిన గదికి సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు, ఆ ముగ్గురూ పనిచేసిన చోట్లలో ఎంక్వైరీ తర్వాత అనుమానితులను పోలీసులు గుర్తించారు. అప్పటికే వాళ్లు పాట్నాకు పారిపోయారని తెలియడంతో పోలీసులు కూడా బయలుదేరారు. చివరికి పాట్నా రైల్వే స్టేషన్ దగ్గర నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వాళ్లిద్దరూ చేసిన నేరాన్ని అంగీకరించారని, మద్యం మత్తులోనే శవంతో సెక్స్ చేశామని చెప్పారని డీసీపీ ఠాకూర్ వెల్లడించారు.