వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బీహార్లో ఘోరం: స్కూల్ బస్ పై తెగిపడ్డ విద్యుత్ వైర్, ఇద్దరు మృతి
పాట్నా: బీహార్ లోని బనియాపూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల బస్సుపై హై వోల్టేజ్ విద్యుత్ తీగ తెగి పడటంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులను ఇంటివద్ద దించడానికి బస్సు బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఘటనలో మరో 11మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. గత ఫిబ్రవరి నెలలో జరిగిన ఓ బస్సు ప్రమాదంలోనూ 10మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. పాట్నా-గయా జాతీయ రహదారిపై ఓ పెళ్లి బస్సు స్కూలు బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
English summary
Two students were electroucuted on Wednesday evening when a high voltage wire collapsed on school bus in Baniyapur, Bihar
Story first published: Wednesday, May 16, 2018, 22:19 [IST]