ఛీ పాడుపని, మగ వ్యభిచారులతో శృంగారం, పని పూర్తయ్యాక అంతే, దీంతో వారిద్దరు ఏం చేశారంటే..
ఇంట్లో దొంగతనం జరిగిందని కంపెనీ ఓనర్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే అతనే వారితో అసహజ రీతిలో శృంగారంలో పాల్గొన్నారని తర్వాత తెలిసి పోలీసులు నోరెళ్లెబట్టారు. దేశ రాజధాని నడిబొడ్డున జరిగిన ఘటన కలకలం రేపింది. ఇంటి ఓనర్ 'గే'బాగోతం బట్టబయలైంది. నిందితులు చెప్పిన అంశాలను విని పోలీసులు ఖంగుతిన్నారు.
వ్యాపారి కట్టుకథ..
ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి కట్టు కథ అల్లి పోలీసులకు తెలిపాడు. తన బంధువుల ఇంట్లో ఇద్దరినీ కలిశానని చెప్పారు. వారు జాబ్ లేదని చెప్పడంతో కంపెనీకి రావాలని చెప్పానని సెలవిచ్చాడు. కంపెనీల డీలర్ షిప్ తీసుకొనేందుకు ఆసక్తి చూపారని.. మరుసటి రోజు ఇంటికి రావాలని కోరినట్టు చెప్పాడు. వాళ్లిద్దరూ వచ్చారని.. తాను బట్టలు మార్చుకునే సమయంలో దాడి చేసి మొబైల్స్, రూ.42 వేల నగదు దోచుకెళ్లారని తెలిపారు. ఇదీ కంపెనీ ఓనర్ అల్లిన కథ.. దీని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
మగ వ్యభిచారులం అని..
ఓనర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. వారిద్దరూ మొబైల్ నంబర్ ఆధారంగా ట్రేస్ పట్టుకున్నారు. దొంగతనానికి సంబంధించి వివరాలు అడిగీ తెలుసుకున్నారు. పోలీసులు తమదైనశైలిలో విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాము మగ వ్యభిచారులమని తెలియజేయడంతో పోలీసులు నోరెళ్లెబెట్టారు. దీంతో కంపెనీ ఓనర్ గే బాగోతం బయటపడింది. వారిని బుక్ చేసుకొని మరీ.. డబ్బులు ఇవ్వలేదు అని నిర్ధారణ అయ్యింది. వారితో పని చేయించుకొని.. డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాడనే విషయం తెలిసింది.
శృంగారం చేసి.. డబ్బులివ్వకపోవడంతో
తామిద్దరం మగ వ్యభిచారులం అని వారు తెలిపారు. శృంగారం కోసం బుక్ చేసుకున్నాడని.. తీరా పని అయ్యాక డబ్బులు ఇవ్వలేదు అని చెప్పారు. ఇప్పుడే కాదు గతంలో కూడా డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. తమను కావాలనే ఇబ్బందులకు గురిచేశాడని.. తమకు గత్యంతరం లేక దొంగతనం చేసినట్టు నిందితులు తెలిపారు. కానీ వారు చెప్పిన అంశాలు విని.. పోలీసులు విస్తుపోయారు. అవునా.. అంటూ ముక్కున వేలేసుకున్నారు.
Recommended Video
వారి మాదిరిగానే...
మెట్రో
పాలిటన్
నగరాల్లో
వ్యభిచార
కూపాలు..
స్త్రీలు
కామనే
కానీ..
మగ
వ్యభిచారులు
కూడా
బయటకు
రావడం
కలకలం
రేపుతోంది.
వారు
తమను
బుక్
చేసుకున్నారని
చెప్పడంతో..
‘గే'లు
అవసరాలు
తీరుస్తున్నారని
తెలుస్తోంది.
కానీ
ఆడవారి
లాగే...
పురుషులతో
కూడా
శ్రమ
దోపిడీ
జరుగుతోందనే
విషయం
బయటకు
వచ్చింది.
కానీ
వారు
చూస్తూ
ఊరుకోలేక
దొంగతనానికి
పాల్పడ్డారు.
వీరిలాగా
ఇంకెందరు
ఉన్నారోననే
అంశం
కలవరానికి
గురిచేస్తోంది.