ఆమెది హత్యే: అత్యాచారం చేసి చంపేశారు, ఇదీ జరిగింది!..
తిరువనంతపురం: విదేశీ మహిళ లిగా స్క్రోమనే హత్య కేసు మిస్టరీ వీడింది. ఆయుర్వేద చికిత్స కోసం కేరళ వచ్చిన ఆమె మార్చి 14వ తేదీ నుంచి అదృశ్యమైపోయింది. ఇటీవలే కుళ్లిపోయిన స్థితిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.
నా భార్య ఆచూకీ చెప్పరా ప్లీజ్!: చివరకు విషాదమే మిగిలింది..
తాజా దర్యాప్తులో లిగా స్క్రోమనేది హత్యగా తేల్చారు కేరళ పోలీసులు. ఉమేష్, ఉదయన్ అనే ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టుగా నిర్దారించారు. వారిద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
మానసిక స్థితి సరిగా లేని లిగా స్క్రోమనే మార్చి 14వ తేదీన అదృశ్యమయ్యాక.. ఉదయన్, ఉమేష్ ల కంటపడింది. మాదకద్రవ్యాలు విక్రయించే ఈ ఇద్దరు ఆమెను మాటలతో మభ్యపెట్టి తమతో తీసుకెళ్లారు. సుందరమైన ప్రదేశాలను చూపిస్తామని చెప్పడంతో.. వారి మాటలు నమ్మి లిగా వెంట వెళ్లింది.
లిగాను ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు ఆమెకు బలవంతంగా మాదకద్రవ్యాలు ఇచ్చి అత్యాచారం చేశారు. ఆపై గొంతునులిమి హత్య చేశారు. అయితే దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు లిగా మృతదేహాన్ని ఉరేసి అక్కడినుంచి పరారయ్యారు. దాదాపు నెలరోజులు మృతదేహం అదే స్థితిలో ఉండటంతో.. తల నుంచి మొండెం వేరైంది. కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని కేరళ డీజీపీ లోకనాథ్ మీడియాకు తెలిపారు.