వివాహిత జంట అక్రమ సంబంధం, వీదిలో రచ్చ రచ్చ చేసిన భార్య, భర్త, ఒకే ఫ్యాన్ కు ఉరి !
బెంగళూరు: ప్రియురాలి భర్త, ప్రియుడి భార్య ఇంటి ముందు గొడవ చెయ్యడంతో వివాహిత ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని మైసూరు నగరంలో జరిగింది. మైసూరు నగగరంలోని రమాబాయి నగర్ నివాసి సంతోష్ కుమార్ (34), జేపీ నగర నివాసి సుమిత్రా (35) ఆత్మహత్య చేసుకున్నారని మంగళవారం పోలీసులు తెలిపారు.
సంతోష్ కుమార్ భార్య అర్చనా. సుమిత్రాకు సిద్దరాజు అనే వ్యక్తితో వివాహం అయ్యింది. వీరికి పిల్లలు ఉన్నారు. సంతోష్ కుమార్, సుమిత్రా జేపీ నగర్ లోని ఒకే గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నారు. ఒకే ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న సంతోష్ కుమార్, సుమిత్రా స్నేహితులు అయ్యారు.
సంతోష్ కుమార్, సుమిత్రాల స్నేహం అక్రమ సంబంధానికి దారి తీసింది. కుటుంబ సభ్యులకు తెలీకుండా వీరు రహస్యంగా కలుసుకునే వారు. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబ పెద్దలు సంతోష్ కుమార్, సుమిత్రాలను హెచ్చరించి రాజీ పంచాయితీ చేశారు.
సంతోష్ కుమార్ భార్య అర్చనా ఊరికి వెళింది. విషయం తెలుసుకున్న సుమిత్రా ప్రియుడు సంతోష్ కుమార్ ఇంటికి చేరుకుంది. చుట్టుపక్కల వారు సుమిత్రా మీ ఇంటికి వచ్చిందని ఫోన్ చేసి చెప్పడంతో అర్చనా ఇంటి దగ్గరకు చేరుకుంది. ఆ సందర్బంలో సంతోష్ కుమార్, సుమిత్రా ఇంటి లోపల గడి పెట్టుకుని ఉన్నారు.
ఇంటి తలుపులు తియ్యాలని అర్చనా గొడవ చేసింది. భార్య ఇంటి దగ్గరకు వచ్చిందని తెలుసుకున్న సంతోష్ కుమార్ హడలిపోయాడు. అదే సమయంలో సుమిత్రా భర్త సిద్దరాజు అక్కడికి చేరుకున్నాడు. తరువాత అర్చనా తన భర్త సంతోష్ కుమార్, సుమిత్రాల అక్రమ సంబంధం గురించి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లింది.