వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుణెలో పేలుడు: పిడుగుపాటుకు 9మంది మృతి

|
Google Oneindia TeluguNews

 Two people injured in low-intensity blast in Pune
పుణె/కోల్‌కతా: మహారాష్ట్రలోని పుణె నగరంలో ఫరక్వానా ప్రాంతంలో స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తీసుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ పేలుడు మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో జరిగింది.

పిడుగుపడి 9మంది మృతి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా జిల్లాలోని శ్యాంపూర్‌లో పిడుగుపాటుకు 9 మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరంతా ఉపాధి హామీ కూలీలు.

ఉపాధి హామీ పని చేస్తున్న వీరంతా భారీ వర్షం రావడంతో తలదాచుకునేందుకు సమీపంలోని దేవాలయంలోకి వెళ్లారు. అయితే దేవాలయంపైనే పిడుగుపడటంతో 9 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఐదుగురు కూలీలను ఆస్పత్రికి తరలించారు.

English summary
Two persons were injured when an explosive placed on a motorcycle went off near a police station here this afternoon, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X