ఆన్ లైన్ లో డీలింగ్, బెంగళూరు అమ్మాయిలకు భలే గిరాకి, చెన్నై అపార్ట్ మెంట్ లో హైటెక్ వ్యభిచారం!
బెంగళూరు: శ్రీమంతులు, విలాసంవతమైన అపార్ట్ మెంట్ లు ఉన్న ప్రాంతంలో హైటెక్ వ్యభిచారం చేస్తున్న ముఠా సభ్యులను చెన్నై సిటీ పోలీసులు అరెస్టు చేశారు. ఐటీ హబ్ బెంగళూరు నగరం నుంచి అందమైన అమ్మాయిలను చెన్నై నగరానికి పిలిపించుకుని ఆన్ లైన్ లో విటులను సంప్రధించి హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న అపార్ట్ మెంట్ పై చెన్నై పోలీసులు దాడులు చేశారు. అపార్ట్ మెంట్ లో వ్యభిచారం చెయ్యడానికి బెంగళూరు నుంచి తీసుకు వచ్చిన ముగ్గురు మహిళలను పోలీసులు రక్షించి బ్రోకర్లను అరెస్టు చేశారు.
పెళ్లి కాని ఆంటీ, ఎర్రగా బుర్రగా బలంగా ఉందని, దుబాయ్ లో కంపెనీలు, ఎండీకి పంగనామాలు, ఎస్కేప్!
శ్రీమంతుల అపార్ట్ మెంట్స్
చెన్నై నగరంలోని అశోక్ నగర్ ప్రాంతంలో శ్రీమంతులు ఎక్కువగా నివాసం ఉంటున్నారు. ఇక్కడ విలాసవంతమైన అపార్ట్ మెంట్ లు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని అపార్ట్ మెంట్ లో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్విహిస్తే పోలీసులకు, స్థానికులను ఎలాంటి అనుమానం రాదని నిందితులు భావించారు.
అర్కాడ్ రోడ్ లో యువతులు
చెన్నై నగరంలోని అశోక్ నగర్ ప్రాంతంలోని అర్కాడ్ రోడ్డులో రాత్రిపూట అందమైన యువతులు, మహిళలు అనుమానాస్పదంగా తిరుగుతున్న విషయం స్థానికులు గుర్తించారు. ఏదో పనిమీద ఇక్కడికి వచ్చి వెలుతున్నట్లు యువతులు, మహిళలు ప్రవర్తించారు. అయితే స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రాత్రి ఎటాక్ చేస్తే షాక్
స్థానికులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆ ప్రాంతంలో నిఘా వేశారు. అమ్మాయిలు, మహిళలు వచ్చి వెలుతున్న విషయం పోలీసులు గుర్తించారు. చెన్నై నగర డిప్యూటీ కమిషనర్ రాధాకృష్ణన్ ఆదేశాల మేరకు పోలీసులు రాత్రి అర్కాడ్ లోని అపార్ట్ మెంట్ పై దాడులు చేశారు. అపార్ట్ మెంట్ లో హైటెక్ వేశ్యవాటిక కేంద్రంలోని విలాసవంతమైన సధుపాయాలు చూసి పోలీసులు షాక్ కు గురైనారు.
బెంగళూరు అమ్మాయిలకు భలే గిరికి
పెరంబలూరు ప్రాంతానికి చెందిన సతీష్, వేలచ్చేరి ప్రాంతానికి చెందిన సెల్వనాథన్ అనే ఇద్దరు బ్రోకర్లు బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అందమైన అమ్మాయిలు, మహిళలను చెన్నైకి తీసుకువచ్చి ఆల్ లైన్ లో విటులను ఆకర్షించి ఆర్కాడ్ లోని అపార్ట్ మెంట్ కు పిలుచుకుని వచ్చి హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వ్యభిచారం చెయ్యడానికి బెంగళూరు నుంచి తీసుకు వచ్చిన ముగ్గురు మహిళలను రక్షించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సతీష్, స్వామినాథన్ అనే బ్రోకర్లను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.