వైరస్ వ్యాప్తి చేస్తోందా?: చైనా కుక్కలు భారత్లోకి!
చెన్నై: భారతదేశంలోకి చైనా నుంచి దిగుమతి అయిన ఓ రెండు చైనా కుక్క పిల్లలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కాంచీపురం జిల్లా శ్రీపెరుం బుదూర్లో ఓ మొబైల్ఫోన్ సంస్థ ఉంది. ఈ సంస్థకు అవసరమైన ఎలక్ర్టానిక్ వస్తువులను తరచుగా చైనా నుంచి దిగుమతి అవుతుంటాయి.
కాగా, శనివారం కూడా యథావిధిగా ఓ కంటైననర్లో ఎక్ట్రానిక్ వస్తువులు దిగుమతి అయ్యాయి. వస్తువులతోపాటు ఆ కంటైనర్లో రెండు కుక్కపిల్లలు ఉండటం గుర్తించిన హార్బర్ సిబ్బంది బ్లూక్రాస్కు సమాచారం అందించారు.
వెటర్నరీ వైద్యులతో అక్కడికి చేరుకున్న బ్లూక్రాస్ సిబ్బంది కుక్కపిల్లలకు పరీక్షలు నిర్వహించారు. చైనా నుంచి దిగుమతి అయిన ఈ కుక్కపిల్లల ద్వారా వైరస్ను పంపివుండవచ్చనే అనుమానంతో వాటి రక్త నమూనాలను పరీక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా, ఆ వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత కుక్క పిల్లలకు సంబంధించిన పూర్తి సమాచారం లభించే అవకాశం ఉంది.