అక్కాచెల్లెళ్ల కిడ్నాప్... రెండు నెలలుగా అత్యాచారం...! తప్పించుకున్న చెల్లెలు
ఇద్దరు అక్కాచెల్లెల్లను కిడ్నాప్ చేసి ఓ వ్యక్తి రెండు నెలలుగా అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే కిడ్నాపర్ బారి నుండి తప్పించుకున్న చెల్లెలు పోలీసులకు పిర్యాధు చేసింది.అయితే అక్కమాత్రం ఇంకా నిందితుడి వద్దె ఉంది. అయితే కిడ్నాప్ అయిన స్థలం ఎక్కడ ఉందో స్పష్టమైన ఆధారాలు పోలీసులకు లభించడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
గత ఎప్రిల్ 24న కూరగాయాల కోసం మార్కెట్కు వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెల్లను గుర్తుతెలియని దుండగుడు కిడ్నాప్ చేసిన ఘటన రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కిడ్నాప్ చేసిన నిందితుడు రెండు నెలల నుండి పలు సార్లు అత్యాచారం చేసినట్టు బాధితురాలు పోలీసులకు పిర్యాధు చేసింది. అయితే కిడ్నాపర్ చెర నుండి చెల్లెలు తప్పించుకుని వచ్చింది.
అయితే అక్క మాత్రం కిడ్నాపర్ నిర్భంధంలోనే ఉంది. అయితే వారు ఇద్దరు ఎక్కడ ఉన్నారో స్పష్టమైన అడ్రస్ లేకపోవడంతో పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు.కాగా ఇదే విషయాన్ని కంచన్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ హరి సింగ్ చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని పోక్సో చట్టం, ఎస్సీ-ఎస్టీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకున్నామని హరి సింగ్ తెలిపారు. బాదితురాలిని కనిపెట్టడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.