మరోసారీ చేయం: భారత్తో మ్యాచ్.. పాక్కు జైకొట్టారు
బెంగళూరు: ప్రపంచ కప్ ట్వంటీ 20లో భాగంగా ఈ నెల 19వ తేదీన పాకిస్తాన్ - భారత్ మధ్య పోరు జరిగింది. ఈ మ్యాచ్ సమయంలో భారత్లోని క్రికెట్ అభిమానులు అందరూ ధోనీ సేన గెలుపు కోసం ప్రార్థనలు చేశాలు. ప్రత్యేక పూజలు చేశారు.
పాకిస్తాన్ పైన భారత్ గెలవగానే ఎందరో వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అయితే కర్నాటకలోని మంగళూరు సమీపంలోని పుట్టూరులో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు పాకిస్తాన్కు మద్దతుగా వాట్సాప్లో సందేశం పెట్టారు.
పాకిస్తాన్కు జై అంటూ వాట్సాప్లో పోస్ట్ పెట్టారు. దీనిపై కళాశాలలోని ఇతర విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలేజీ విద్యార్థులు భగ్గుమన్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. పోస్ట్ చేసిన విద్యార్థులను బుధవారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు వారిని హాజరుపరిచారు. సత్ప్రవర్తనతో ఉంటామనే హామీతో వారిని విడుదల చేశారు. విద్యార్థుల పైన దేశద్రోహం కేసు నమోదు చేసే ఉద్దేశ్యం లేదని పోలీసులు చెప్పారు. కోల్కతాలో జరిగిన ఈ మ్యాచులో భారత్ ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్ పైన విజయం సాధించిన విషయం తెలిసిందే.