కర్ణాటకలో తెలుగు టెక్కీల మృతి,కొత్త బైక్ పై కొన్ని గంటలే...
రాయచోటి:కర్ణాటకలోని చింతామణి సమీపంలోని శ్రీనివాసపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మృతిచెందారు.మరణించినవారు ఇద్దరు కూడ తెలుగు టెక్కీలు. కొత్త బైక్ ను కొనుగోలు చేసి వస్తోండగా జరిగిన ప్రమాదంలో వారు మరణించారు.
చిత్తూరు జిల్లా కలకడ మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.
బత్తిన సత్యరాజ్ , బత్తిన అమల్ రాజ్ లు మోటార్ బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.
కడప జిల్లా రాయచోటిలోని గాలివీడు రోడ్డులో పోలీస్ క్వార్టర్స్ సమీపంలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ బెంగుళూరులోని సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
చింతామణిలో మోటార్ బైక్ ను కొనుగోలు చేసి బెంగుళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే మార్గమధ్యలో వీరి బైక్ ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
కర్ణాటకలోని చింతామణి సమీపంలోని శ్రీనివాసపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మృతిచెందారు.మరణించినవారు ఇద్దరు కూడ తెలుగు టెక్కీలు. కొత్త బైక్ ను కొనుగోలు చేసి వస్తోండగా జరిగిన ప్రమాదంలో వారు మరణించారు.