దౌర్జన్యం, గందరగోళం, ఆరాచకం మధ్య మోడీ 100 రోజుల పాలన : రాహుల్ గాంధి
ప్రధాని మోడి ప్రధానమంత్రిగా కేంద్రంలో అధికారం చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకోవడంపై ప్రతిపక్ష నేత మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. మోడీ వంద రోజుల పాలన దౌర్జన్యం, గందరగోళం మరియు ఆరాచకం మధ్య కొనసాగిందని రాహుల్ గాంధీ విమర్శించారు. తీవ్ర మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఆర్థిక వ్యవస్థ విషయంలో మోదీ సర్కారుకు దిశానిర్దేశం, నాయకత్వం కొరవడిందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూనే మరోవైపు విమర్శలు చేశాడు. ప్రజాస్వామ్యాన్ని నిరంతరాయంగా అణచి వేయడంతో పాటు,విమర్శలు చేసిన మీడియాను లోంగదీసుకోవడం మరియు వారి గొంతు నొక్కడం లాంటీ చర్యలకు పాల్పడడంతో ప్రణాళికలకు లేకుండా ఆర్ధిక వ్యవస్థను దెబ్బచర్యలకు పూనుకున్నారని ట్విట్టర్లో పేర్కోన్నారు.
మరోవైపు వందరోజుల పరిపాలన సంధర్భంగా హర్యాణలో మాట్లాడిని ప్రధాని మోడీ వందరోజుల్లో దేశం అనేక అభివృద్ది చెందడంతోపాటు దేశంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయని ప్రధాని పేర్కోన్నారు.రైతు సంక్షేమంతో పాటు జాతీ భద్రతకు అనేక చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు.గత 60 ఏళ్లలలో ఎన్నడు లేని ఆర్టికల్ 370 రద్దు,ట్రిపుల్ తలాక్, వంటి విధంగా అనేక బిల్లులు పార్లమెంట్లో అమోదం పోందాయని ఆయన తెలిపారు. ఇదంతా 130 కోట్ల మంది భారతీయుల స్పూర్తితోనే ముందుకు సాగాయని చెప్పారు.