బీజేపీ చర్యలకు ఉద్దవ్ మద్దతు ? కర్ణాటక పరిణామాలను అభినందించిన శివసేన చీఫ్
ముంబై : ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన బీజేపీ చేసిన చర్యలకు మద్దతిచ్చింది. అయితే మరో రెండునెలల్లో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శివసేన వైఖరి ప్రాధాన్యం సంతరించుకుంది. గత 3 వారాలుగా కొనసాగిన సస్పెన్స్ను ఇటీవల తెరపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే స్పందించారు.
Recommended Video
గత కొంతకాలంగా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న శివసేన .. తాజాగా స్వరం మార్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు బీజేపీకి విషేష్ తెలుపడం విస్మయానికి గురిచేసింది. అంతేకాదు జేడీఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ప్రజాస్వామ్యానికి చేటు కలిగినట్టేనని వ్యాఖ్యానించడం ఆసక్తి కలిగించింది. ఎట్టకేలకు కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొనడం విశేషం.
మెజార్టీ లేని రాష్ట్రాలలో అధికారంలోకి రావడం అంటే ప్రజాస్వామ్యానికి చేటు చేయడమని శివసేన పేర్కొనడం గమనార్హం. అయితే కర్ణాటకలో బీజేపీకి 105 సభ్యుల మద్దతు ఉంది. అయితే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇంకా ఆహ్వానం రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో శివసేన కామెంట్స్ సంచలనం కలిగించాయి. మరోవైపు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కూడా జెండా పాతాలని బీజేపీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఉద్దవ్ హాట్ కామెంట్స్ చేశారు.