వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధార్ సేవా కేంద్రాలపై కేంద్రం గుడ్ న్యూస్- - దేశంలో 14 వేల సెంటర్లు తిరిగి ప్రారంభం....

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో మూతపడిన 14 వేల ఆధార్ సేవా కేంద్రాలను కేంద్రం తిరిగి ప్రారంభించింది. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో వీటిని తిరిగి తెరుస్తున్నట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-యుడాయ్ ఇవాళ ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆధార్ కేంద్రాలతో పాటు పోస్టాఫీస్ లు, బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్ సెంటర్లు తదితర చోట్ల ఈ సెంటర్లు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్‌లోని మాదాపూర్, విజయవాడలోని లబ్బీపేట, విశాఖపట్టణంలోని ద్వారకానగర్, వరంగల్‌లోని నయీంనగర్‌లలో ప్రస్తుతం ఆధార్ సేవా కేంద్రాలు తెరుచుకున్నట్టు ఆధార్ ప్రాధికార సంస్ధ తన ట్వీట్లో తెలిపింది.

uidai re opens 14,000 aadhar centres across the country

ఆధార్‌‌కార్డులో మార్పు చేర్పులు చేసుకోవాలనుకునే వారు ఆయా చోట్ల తమ సేవలను వినియోగించుకోవచ్చని కేంద్రం పేర్కొంది. వాస్తవానికి కేంద్రం పరిధిలోని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆధార్ సేవా సెంటర్లు మాత్రమే ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. వీటితో పాటు చాలా ప్రాంతాల్లో ప్రైవేటు ఏజెంట్ల ఆధ్వర్యంలో, ఆన్ లైన్ ద్వారా కూడా ఆధార్ మార్పులు చేర్పులు చేసుకునేందుకు, కొత్తగా నమోదు చేసుకునేందుకు వీలుంది.

English summary
uidai on thursday tweets that it has re opened 14,000 aadhar kendras across the country as a part of lock down relaxations. and now customers be able to modify their data and take new cards also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X