మోడీ-షాపై ఉమా భారతి నిప్పులు: తల్లి కుమార్తె ఆత్మహత్యకు కారణం..బెయిల్ పై ఉన్న ఎమ్మెల్యేతో మద్దతా?
లక్నో: హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించడానికి భారతీయ జనతాపార్టీ స్వతంత్ర ఎమ్మెల్యేలపై ఆధారపడింది. ఇందులో తప్పు లేదు గానీ.. ఆ స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఒకరైన గోపాల్ కందా మద్దతును తీసుకోవడం పట్ల బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రి ఉమా భారతి నిప్పులు చెరుగుతున్నారు. బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యక్తి మద్దతు పార్టీకి అవసరమా? అంటూ ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలను ప్రశ్నించారు.
1. माननीय @narendramodi जी का, @AmitShah जी का, @JPNadda जी, @mlkhattar जी का एवं @Dev_Fadnavis जी का महाराष्ट्र एवं हरियाणा के शानदार जीत के लिए अभिनंदन।
— Uma Bharti (@umasribharti) October 25, 2019
ఈ మేరకు శుక్రవారం ఆమె వరుస ట్వీట్లను సంధించారు. తల్లి కుమార్తె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారకుడైన గోపాల్ కందాపై అనేక కేసులు ఉన్నాయని, అలాంటి వ్యక్తి మద్దతును తీసుకోవాల్సిన దుస్థితి పార్టీకి ఏర్పిడిందా? అని ప్రశ్నించారు. గోపాల్ కందా కేసు వ్యవహారం ఇంకా న్యాయస్థానంలో ఉందని, అతను బెయిల్ పై బయటికి వచ్చాడని చెప్పారు. బీజేపీకంటూ కొన్ని నైతిక విలువలు, కట్టుబాట్లు, నిబంధనలు ఉన్నాయని, అవే.. ఇతర రాజకీయ పార్టీల కంటే భిన్నంగా నిలిపాయని అన్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కే అలవాటు బీజేపీకి ఆరంభం నుంచీ లేదని చెప్పారు.
3. मैं अभी अपने गंगा प्रवास पर हिमालय में गंगा के किनारे हूँ। यहाँ टीवी नहीं है, मैं मोबाइल पर सारी ख़बरें ले रही हूँ, मुझे जानकारी मिली है कि हम हरियाणा में भी सरकार बना सकते हैं। यह एक अच्छी ख़बर है।
— Uma Bharti (@umasribharti) October 25, 2019
హర్యానాలో తమ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, అలా కోరుకునే వారిలో తాను ముందంజలో ఉన్నానని అన్నారు. గోపాల్ కందా వంటి వ్యక్తి మద్దతును తీసుకోవడం సరికాదని అన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి గోపాల్ కందా వంటి వ్యక్తుల అవసరం ఎంతమాత్రమూ లేదని చెప్పారు. అత్యున్నత విలువలు పాటించే నరేంద్ర మోడీ వంటి నాయకులు తమకు ఉన్నారని గుర్తు చేశారు. వారి ఛరిష్మాను చూసి ఎవ్వరైనా పార్టీకి మద్దుతు ఇస్తారని, అలాంటి పరిస్థితుల్లో గోపాల్ కందా మద్దతు తీసుకోవడంలో అర్థం లేదని అన్నారు.
4. मुझे जानकारी मिली है कि गोपाल कांडा नाम के एक निर्दलीय विधायक का समर्थन भी हमें मिल सकता है। इसी पर मुझे कुछ कहना है।
— Uma Bharti (@umasribharti) October 25, 2019
గోపాల్ కందా నేరస్తుడా? లేక నిరపరాధా అనే విషయాన్ని న్యాయస్థానం తేల్చుతుందని, త్వరలోనే దీనికి సంబంధించిన తీర్పు వెలువడాల్సి ఉందని అన్నారు. ఎన్నికల్లో గెలవగానే గోపాల్ కందా పునీతుడైపోయాడని తాను భావించట్లేదని ఉమా భారతి చెప్పారు. ఎన్నికల్లో గెలవడానికి అనేక అంశాలు కారణమౌతాయని, డబ్బు వెదజల్లడం, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం వంటివి కూడా అందులో ఒకటని అన్నారు. ఇలాంటప్పుడు గోపాల్ కందా మద్దతును తీసుకోవడం మంచి పరిణామం కాదని, ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని సూచించారు.
5. अगर गोपाल कांडा वही व्यक्ति है जिसकी वजह से एक लड़की ने आत्महत्या की थी तथा उसकी माँ ने भी न्याय नहीं मिलने पर आत्महत्या कर ली थी, मामला अभी कोर्ट में विचाराधीन है, तथा यह व्यक्ति ज़मानत पर बाहर है।
— Uma Bharti (@umasribharti) October 25, 2019
6. गोपाल कांडा बेक़सूर है या अपराधी, यह तो क़ानून साक्ष्यों के आधार पर तय करेगा, किंतु उसका चुनाव जीतना उसे अपराधों से बरी नहीं करता। चुनाव जीतने के बहुत सारे फैक्टर होते हैं।
— Uma Bharti (@umasribharti) October 25, 2019
7. मैं @BJP4India जी से अनुरोध करूँगी कि हम अपने नैतिक अधिष्ठान को न भूलें। हमारे पास तो @narendramodi जी जैसी शक्ति मौजूद है, एवं देश क्या पूरे दुनिया की जनता मोदी जी के साथ है तथा मोदी जी ने सतोगुणी ऊर्जा के आधार पर राष्ट्रवाद की शक्ति खड़ी की है।
— Uma Bharti (@umasribharti) October 25, 2019
8. हरियाणा में हमारी सरकार ज़रूर बने, लेकिन यह तय करिए कि जैसे @BJP4India के कार्यकर्ता साफ़-सुथरे ज़िंदगी के होते हैं, हमारे साथ वैसे ही लोग हों। #HaryanaElections2019
— Uma Bharti (@umasribharti) October 25, 2019