వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం..శిథిలాల మధ్య చిక్కుకున్న కార్మికులు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న అయిదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు దుర్మరణం పాలైనట్లు ప్రాథమికంగా అందిన సమాచారం. 50 మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. భవన శిథిలాల కింద మరో 15 మంది కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కర్ణాటకలోని ధార్వాడలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.

under-construction building collapses in Dharwad, Karnataka

ధర్వాడలోని కుమరేశ్వర నగర ప్రాంతంలో ఉన్న కేవీజీ బ్యాంగ్ సమీపంలో అయిదు అంతస్తుల భవనం కొద్దిరోజులుగా నిర్మాణంలో ఉంది. ఏడాది కాలంగా ఈ భవన నిర్మాణం కొనసాగుతోంది. మధ్యాహ్నం 3:40 నిమిషాల సమయంలో పెద్దగా శబ్దం చేస్తూ ఒక్కసారిగా ఈ భవనం కుప్పకూలిపోయింది. ఈ సమయంలో పలువురు కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భవనం కుప్పకూలిన వెంటనే సంఘటనాస్థలంలో పెద్ద ఎత్తున హాహాకారాలు చెలరేగాయి.

ఎలక్షన్ ఎఫెక్ట్ : విమానాలు, చాపర్లు హౌస్‌ఫుల్ ఎలక్షన్ ఎఫెక్ట్ : విమానాలు, చాపర్లు హౌస్‌ఫుల్

under-construction building collapses in Dharwad, Karnataka

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. మూడు జేసీబీలను తెప్పించారు. వాటి సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రప్పిస్తున్నామని పోలీసులు చెప్పారు. కనీసం 15 మంది కార్మికులు శిథిలాల చిక్కుకుని ఉండొచ్చని తమకు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని అన్నారు. గాయపడ్డ వారిని అంబులెన్సుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారి సంఖ్య అధికంగా పోలీసులు ఏకంగా 10 అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

English summary
Three person feared to died when an under-construction building collapsed at Kumareshwara Nagar in Karnataka's Dharwad district on Tuesday. Nearly 50 people are trapped under the debris. Construction work was going on when the tragedy happened. Three JCBs, four fire tenders and 10 ambulances are at the spot. five storey building was being constructed. The first and second floors of the building were already rented out.The rescued people are being rushed to a nearby hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X