ఘోర ప్రమాదం: పైకప్పు కుప్పకూలడంతో 21 మంది మృతి, శిథిలాల కింద మరికొందరు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఘజియాబాద్లోని మురాద్నగర్లో వర్షం కారణంగా శ్మశాన వాటిక ఘాట్ కంప్లెక్స్లోని గ్యాలరీ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 21 మంది మృతి చెందారు.
శిథిలాల కింద మరో 20 మందికిపైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్నవారిని బయటికి తీస్తున్నారు.
కాగా, శ్మశాన వాటికలో ఓ వ్యక్తి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. అంత్యక్రియలకు హాజరైన సుమారు 45 మంది బంధువులు వర్షం కారణంగా ఆ భవనం కింద నిల్చున్నారు. ఆ సమయంలోనే భవనం కూలడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
Atleast 8 dead, several injured after under construction ceiling collapsed at crematorium in #Muradnagar , #Ghaziabad.
— Advitya (@advityabahl) January 3, 2021
Rescue operation underway. @NDRFHQ @myogioffice @ghaziabadpolice pic.twitter.com/rcI1CAgs73
ఘటనలో గాయపడినవారిన హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.