ఛోటా రాజన్ సోదరుడికి చెక్, ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేం, బీజేపీ, శివసేన దెబ్బకు !
ముంబై/పూణే: మాఫియా డాన్ ఛోటా రాజన్ సోదరుడు దీపక్ నిక్లాజేకి తాము శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టిక్కెట్ ఇవ్వలేమని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్ పీఐ అఠావళే) తేల్చి చెప్పింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఒక్క రోజు తరువాత ఆర్ పీఐ ఛోటా రాజన్ సోదరుడు దీపక్ నిక్లాజేకి టిక్కెట్ ఇవ్వలేమని చేతులు ఎత్తేసింది.
ఏం పోయేకాలం: అర్దరాత్రి మహిళను నడిరోడ్డులో వదిలేసిన ఓలా క్యాబ్ డ్రైవర్!
మహారాష్ట్రలోని సతారా జిల్లా ఫైల్వాన్ నియోజక వర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఛోటా రాజన్ సోదరుడు దీపక్ కు ఆర్ పీఐ టిక్కెట్ ఇచ్చింది. గురువారం ఆర్ పీఐ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ నాయకులు విడుదల చేశారు.
ఫైల్వాన్ నియోజక వర్గం నుంచి దీపక్ కు టిక్కెట్ ఇచ్చామని ఆర్ పీఐ పార్టీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మంత్రి అవినాష్ మహటేకర్ గురువారం మీడియాకు చెప్పారు. బీజేపీకి ఆర్ పీఐ మిత్రపక్ష పార్టీ. ఫైల్వాన్ నియోజక వర్గంలో ఛోటా రాజన్ సోదరుడు దీపక్ పోటీ చెయ్యడాన్ని స్థానిక నాయకులు, కార్యకర్తలు వ్యతిరేకించారు.
చిక్కుల్లో ట్రబుల్ షూటర్, మనీ ల్యాండరింగ్ కేసు సీబీఐకి, బీజేపీ దెబ్బకు విలవిల !
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ, శివసేన, ఆర్ పీఐ పార్టీల మధ్య సీట్ల పంపిణి జరిగింది. ఆర్ పీఐ పార్టీ అభ్యర్థులు పోటీ చెయ్యడానికి ఆరు నియోజక వర్గాలు కేటాయించారు. ఆరు నియోజక వర్గాల్లో ఫైల్వాన్ నియోజక వర్గం ఒకటి.
ఛోటా రాజన్ సోదరుడు దీపక్ ఫైల్వాన్ నియోజక వర్గం వ్యక్తి కాదు. స్థానికంగా నివాసం ఉంటున్న దిగంబర్ అగావానేకి సీటు ఇవ్వాలని స్థానికులు ఆందోళన చేశారు. ఛోటా రాజన్ సోదరుడు దీపక్ ను తప్పించి ఆ స్థానంలో దిగంబర్ అగావనేను పోటీ చేయించాలని ఆర్ పీఐ పార్టీ నిర్ణయించదని, కేంద్ర మంత్రి, ఆ పార్టీ వ్యవస్థాపకుడు రామదాస్ అరావళే శుక్రవారం తెలిపారు.