బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘోర రోడ్డు ప్రమాదం: కేంద్రమంత్రి భార్యతోపాటు మరొకరు మృతి, శ్రీపాద్ నాయక్‌కు తీవ్రగాయాలు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆయూష్, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్ భార్య విజయ, వ్యక్తిగత కార్యదర్శి దీపక్ మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదం కర్ణాటకలో జరిగింది.

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకుల సమీపంలో కేంద్రమంత్రి శ్రీపాద నాయక్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎల్లాపూర్ నుంచి గోకర్ణ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

 Union AYUSH Minister Shripad Naik meets with accident; wife dies in hospital

కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్‌కు మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి కోరారు. కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్ త్వరలోనే కోలుకోవాలని బీజేపీతోపాటు ఇతర పార్టీల రాజకీయ నేతలు ఆకాంక్షించారు.

 Union AYUSH Minister Shripad Naik meets with accident; wife dies in hospital

English summary
In a tragic incident, Union Minister Shripad Naik who was travelling in the car met with an accident and his wife Vijaya Naik died in the hospital this evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X