కేంద్ర బడ్జెట్ 2018: సంప్రదాయాన్నే పాటించిన జైట్లీ
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ కాబట్టి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తారని, హిందీలో బడ్జెట్ ప్రసంగం చేస్తారని వార్తలు వచ్చాయి. గురువారంనాడు ఆయన తన బడ్జెట్ ప్రసంగాన్ని ఎప్పటిలాగే ఆంగ్ల భాషలో కొనసాగించారు.
తొలిసారి ఆయన హిందీలో బడ్జెట్ ప్రసంగం చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో ఆయన ఆంగ్లంలోనే ప్రసంగం సాగించినట్లు చెబుతున్నారు. జిఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇదే తొలి బడ్జెట్.
జిఎస్టీ అమలుతో పేదలకు మేలు జరిగిందని జైట్లీ భావించారు. అంచనా వేసినట్లుగానే ప్రసంగంలో తొలుత రైతుల కోసం తీసుకోబోయే సంస్కరణలపై ప్రసంగం ప్రారంభించారు.
Recommended Video
ఈ ఏడాది వ్యవసాయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించనున్నట్లు జైట్లీ తెలిపారు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు వచ్చిందని ఆయన అన్నారు.