చిన్నారుల అత్యాచారానికి ఉరిశిక్ష... చట్టాన్ని సవరించనున్న కేంద్రం
ఇకపై చిన్నారులు, మహిళలలపై దాడులు, అత్యచారాలను అడ్డుకునేందుకు కేంద్రం మరిన్ని కఠిన చట్టాలను తీసుకురానుంది.దేశంలో మైనార్ బాలికలపై జరుగుతున్న అత్యాచారలను అరికట్టేందుకు నడుంబిగించింది. ఇందులో బాగంగానే పోక్సో చట్టసవరణకు కేంద్ర కేబినెట్ అమోదించింది. సవరించనున్న చట్టం ప్రకారం మైనారిటి మహిళలపై అత్యచారానికి పాప్పడిన కేసుల్లో ఉరిశిక్ష పడనుంది.
పార్లమెంట్ తీసుకు రావాల్సిన చట్టసవరణపై నేడు సమావేశామైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనేపథ్యంలోనే చిన్నారులపై అత్యచారానికి పాల్పడే నిందితులపై ఉరిశిక్ష పడే విధంగా పోక్సో చట్టాన్ని సవరించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు పిల్లల పోర్నోసైట్లకు పాల్పడినా ,జరిమానాలతోపాటు శిక్షలు పడే విధంగా చట్టాన్ని సవరణ చేయాలని నిర్ణయించింది.
కాగా ఈ చట్టానికి సంబంధించింది పలు రాష్ట్ర్రాలను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మైనారీటలపై అత్యచారాలు జరిగే రాష్ట్ర్రాలను సంప్రదించిన తర్వాతే క్యాబినెట్ ఈ నిర్ణయించింది. మరోవైపు రూ.80,250 కోట్లతో లక్షా 25 వేల కి.మీ రోడ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు దేశంలో అసంఘటిత రంగ కార్మీకులకు మేలు చేసే విధంగా కార్మీక రక్షక కోడ్ను తీసుకువచ్చేందుకు క్యాబినెట్ ఆమోద్ర ముద్ర వేసింది.