ఇకపై ఎంఎస్ఎంఈ నిర్వచనం ఇదే.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతులకు గుడ్ న్యూస్
కరోనా విజృంభణ,చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థలపై చర్చించేందుకు కేంద్ర కేబినెట్ సోమవారం(జూన్ 1) సమావేశమైంది. మోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తయిన సందర్భంలో ఈ సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు రెండు ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించింది. ఎంఎస్ఎంఈల ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అభిప్రాయపడింది. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు.
ఏపీలో తగ్గని కరోనా ఉధృతి: మరిన్ని గడ్డురోజులు: విస్తుపోయేలా పాజిటివ్ కేసుల పెరుగుదల
ఎంఎస్ఎంఈ నిర్వచనం మార్పు..
ఎంఎస్ఈల
నిర్వచనాన్ని
మార్చేందుకు
కేంద్ర
కేబినెట్
నిర్ణయం
తీసుకుందని
ప్రకాష్
జవదేకర్
తెలిపారు.
దాని
ప్రకారం..
ఇకనుంచి
రూ.10కోట్లు
పెట్టుబడి,రూ.50కోట్లు
ఆదాయం
ఉండే
వ్యాపారాలను
చిన్న
తరహా
పరిశ్రమలుగా
పరిగణిస్తారు.
అలాగే
ఇకనుంచి
రూ.250కోట్లు
ఆదాయం
ఉండే
పరిశ్రమలను
మధ్య
తరహా
పరిశ్రమలుగా
పరిగణిస్తారు.
గతంలో
దీని
పరిమితి
రూ.100కోట్లుగా
ఉండేది.
తాజా
సవరణల
ద్వారా
రాబోయే
ఏళ్లలో
2లక్షల
పరిశ్రమలకు
లబ్ది
చేకూరుతుందన్నారు.
ఎంఎస్ఎంఈలకు
అత్యవసర
రుణ
సదుపాయం
కింద
రూ.3లక్షల
కోట్ల
నిధిని
ఏర్పాటు
చేస్తున్నామని
మరో
కేంద్రమంత్రి
నితిన్
గడ్కరీ
తెలిపారు.
అత్యవసర
క్రెడిట్
లైన్
ప్రమాణాలకు
అనుగుణంగా
ఉండి
MSME
మంత్రిత్వ
శాఖలో
నమోదై
ఉండే
స్టార్టప్స్
అత్యవసర
క్రెడిట్కు
అర్హులు
అని
దాదాపు
రెండు
నెలల
తర్వాత
మొదలైన
పరిశ్రమల
కార్యకలాపాలు
క్రమంగా
పుంజుకుంటున్నాయని..
రాబోయే
రోజుల్లో
మరిన్ని
సడలింపులకు
అవకాశమిస్తామని
స్పష్టం
చేశారు.
ఎంఎస్ఎంఈ ప్యాకేజీ
ఎంఎస్ఎంఈలకు
రూ.20వేల
కోట్లు,రూ.50వేల
కోట్ల
ప్యాకేజీలకు
కేబినెట్
ఆమోదం
తెలిపిందన్నారు.రూ.20వేల
కోట్లు
ప్యాకేజీ
ద్వారా
కుదేలైన
ఎంఎస్ఎంఈలకు
చేయూతనందిస్తామని,అలాగే
రూ.50వేల
కోట్ల
ప్రతిపాదిత
నిధి
ఎంఎస్ఎంఈ
రంగంలో
ప్రైవేటు
రంగ
పెట్టుబడులను
ప్రోత్సహిస్తామన్నారు.
వీధి
వ్యాపారులకు
రుణాలు
మంజూరు
చేసే
'పీఎం
స్వనిధి'
పథకానికి
కేబినెట్
ఆమోదం
తెలిపిందని
చెప్పారు.
సుమారు
5
మిలియన్ల
మంది
వీధి
వ్యాపారులు
దీని
ద్వారా
లబ్ది
పొందుతారని
చెప్పారు.
రైతులకు గుడ్ న్యూస్
కిసాన్ క్రెడిట్ కార్డు కింద రైతులకు ఇచ్చే రుణాలకు సంబంధించిన నిబంధనలను సడలించి రుణ ప్రక్రియను మరింత సులభతరం చేస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.ఎంఎస్ఎంఈలతో పాటు రైతాంగానికి కూడా చేయూత అందించాలని నిర్ణయించామన్నారు. ఖరీఫ్లో 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచేందుకు కేబినెట్ ఆమోదించిందన్నారు. ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధర కంటే రైతులకు 50-83శాతం అధిక మద్దతు ధరను అందిస్తామని చెప్పారు. అలాగే అగస్టు 31 లోపు రుణాలు చెల్లించిన రైతులకు 4శాతం వడ్డీ రేటుకు కొత్త రుణాలు మంజూరు చేయబడుతాయని చెప్పారు