'మి టు'పై కేంద్రం స్పందన, రిటైర్డ్ జడ్జిలతో కమిటీ: స్పందించిన మేనకాగాంధీ
న్యూఢిల్లీ: 'మి టూ' వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు స్పందించింది. ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ప్రత్యేక ప్యానల్ను ఏర్పాటు చేయనుంది. ఈ ఆరోపణలపై నలుగురు రిటైర్డ్ జడ్జిలతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు కానుంది.
'మి టూ' ఉద్యమంపై కేంద్రమంత్రి మేనకా గాంధీ స్పందించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. వారిని (మి టూ అంటూ ఆరోపణలు చేస్తున్న మహిళలు) అందరిని తాను విశ్వసిస్తున్నానని, అందులోని ప్రతి ఒక్కరి బాధను తాను గుర్తించానని అన్నారు.
కార్పోరేట్ కంపెనీలకు 'మి టు' సెగ: టాటా మోటార్స్ కమ్యూనికేషన్ చీఫ్పై ఆరోపణలు
ఈ కారణంగానే సీనియర్ జ్యుడిషియల్, లీగల్ పర్సన్స్తో తాను ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. మహిళలపై వేధింపుల అంశాన్ని ఉపేక్షించేది లేదని చెప్పారు. దీనిపై చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. తాను ఏర్పాటు చేసిన కమిటీతో ఈ ఉద్యమంలోని కేసులపై విచారణ జరిపిస్తామన్నారు.