వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికన్ సీల్స్ చేయలేనిది.. మనం ఎందుకు చేయలేం: 24 గంటల్లో ఏదైనా జరగొచ్చు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ యుద్ధం ఖాయం అనేలా ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కరోజులో ఏదైనా జరగొచ్చు అని ప్రకటించారు. పాకిస్తాన్ కు చెందిన మూడు జెట్ ఫైటర్లు భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చి, రాజౌరీ సెక్టార్ లో బాంబులు వేసిన ఘటన అనంతరం అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టడానికి అమెరికాకు చెందిన నేవీ సీల్స్ బలగాలు పాకిస్తాన్ లోకి చొచ్చుకు వెళ్లాయని గుర్తుచేశారు. అబోట్టాబాద్ లో లాడెన్ ఇంటిని, స్థావరాన్ని చుట్టుముట్టి, అతణ్ని కాల్చి చంపాయని, అదే పని మనం ఎందుకు చేయలేమని ప్రశ్నించారు. అమెరికా నేవీ సీల్స్ చేసిన పనిని, మనం చేయలేమా? ఎందుకు చేయలేం అనే విషయంపై ఆలోచిస్తున్నాం. ఈ రోజు (బుధవారం) ఏదైనా జరగొచ్చు. యుఎస్ నేవీ సీల్స్ తరహాలో మనమూ చేయగలం.. అని అరుణ్ జైట్లీ చెప్పారు. 24 గంటల వ్యవధిలోనే అమెరికన్ నేవీ సీల్స్ కరడుగట్టిన ఉగ్రవాది బిన్ లాడెన్ ను అంతం చేశాయని, అలా 24 గంటల్లో తాము కూడా ఏదైనా చేయగలమని, ఆ దిశగా ఆలోచిస్తున్నామని అన్నారు.

United States seals took away Laden from Abbottabad why cant we do it? says Arun Jaitley

రాజకీయాలు మాట్లాడుకోవడానికి చాలా సమయం ఉందని చెప్పారు. వారంరోజుల పాటు రాజకీయాలు మాట్లాడుకోవచ్చని, సైనిక చర్య తీసుకోవడానికి ఒక్కరోజు చాలు అని జైట్లీ స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి తరువాత దేశ ప్రజలు అంతా తమ వెంటే ఉన్నారని, సైనిక చర్య కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలు క్షీణించినట్టేనని అన్నారు. దీన్ని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత పాకిస్తాన్ దేనని, తమది కాదని అన్నారు. యుద్ధాన్ని నివారించడానికి తాము ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామని, అయినప్పటికీ, పాక్ ప్రతిక్షణం తమను రెచ్చగొడుతూనే ఉందని, పుల్వామా దాడి ఇందులో భాగమేనని చెప్పారు.

English summary
Finance minister Arun Jaitley on Wednesday referred to the United States navy seals operation in Pakistan's Abbottabad in 2011 to kill Ad-Qaeda founder Osama bin Laden and said that anything is possible today. Arun Jaitley's statement has come hours after Pakistani jets crossed the Line of Control (LoC) and even dropped bombs near Indian Army post in Rajouri sector. "If US navy seals can kill Obama, anything is possible today. A week is too long a time in politics. The way the nation has rallied behind us in the last one week, it seems like a week slipped by too quickly. I recall how the United States' seals took away Osama bin Laden from inside an Abbottabad compound in Pakistan. We would think why can't we do it? That was the thought. Today, we know we can do it," Arun Jaitley said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X