ఉగ్రవాదంపై ఉక్కుపాదం మరో తీవ్రసంస్థ నిషేధం...
దేశంలో సంపూర్ణ మెజారీటీ సాధించడంతో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పావులు కదుపుతుంది. ఈనేపథ్యంలో ఉగ్రవాద కార్యకాలపాలు చేపట్టిన పలు సంస్థలు నిషేధించిన కేంద్రం మరోసారి పదవి చేపట్టడానికి ముందు తీవ్రవాద సంస్థలపై నిషేధించింది.ముఖ్యంగా పశ్చిమ బెంగాల్,అస్సాం, త్రిపుర రాష్ట్ర్రాల సరిహద్దుల్లో తీవ్రవాద కార్యకలపాపలు నిర్వహిస్తున్న'' జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ '' అనే తీవ్రవాద సంస్థను నిషేధిస్తుంది.
కాగా నిషేధించబడిన తీవ్రవాద సంస్థ తీవ్రవాదాన్ని ప్రోత్సహించడంతో పాటు నిధులు వసూలు చేసి ఉగ్రవాద కార్యక్రమాలను చేపడుతుందని, మరోవైపు ఆసంస్థకు చెందిన పలువురు తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గోన్నారని కేంద్రం ప్రకటించింది. 1998లో ప్రారంభమైన ఈ సంస్థ పలు బాంబుదాడుల్లో కూడ పాల్గోన్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ప్రాంతంలో ఆసంస్థ కార్యకలాపాలు చేస్తుండడంతో అక్కడ 17 స్థానాలను సాధించిన బీజేపీ ఉగ్రవాద సంస్థను నిషేధించింది.