దారుణం: ఉన్నావో కేసులో.. బాధితురాలి చెల్లిని కూడా వదిలిపెట్టలేదు..!!
ఉన్నావో అత్యాచారం కేసు విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే అత్యాచారం చేయడంతోపాటు బాధితురాలి చెల్లెలిపై కూడ ఎమ్మెల్యే అనుచరులు సైతం లైంగిక వేధింపులకు గురిచేశారని,కేసును విరమించుకోమని బాధితురాలి తండ్రిని కట్టేసి కోట్టారు. మరోవైపు కేసు నమోదు కాకుండా సంవత్సర కాలం పాటు ప్రయత్నాలు చేశారని బాధితురాలి తల్లి పలు విషయాలను వెల్లడించింది.
ఉన్నావో అత్యాచారంపై సుప్రిం కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతుండడంతో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ఆగడాలు ఒక్కోక్కటి బయటపడుతున్నాయి. ఉద్యోగం కోసం వచ్చిన యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా అందుకు సంబంధించి ఎలాంటీ కేసులు నమోదు కాకుండా అనేక ఆఘాయిత్యాలకు పాల్పడ్డట్టు పలు ఆరోపణలు ఎదుర్కోంటున్నాడు.
ఈ నేపథ్యంలోనే బాధితురాలిని తల్లిని కలిసిన మహిళ హక్కుల పరిరక్షణ కమిటి సభ్యులు కలిసి పలు వివరాలు సేకరించారు. ఈనేపథ్యంలోనే బాధితురాలి తల్లి సంచలన విషయాలు బయటపెట్టింది. ఈనేపథ్యంలోనే కేసు నమోదు తర్వాత బాధితురాలి ఇంటికి ఎమ్మెల్యే అనుచరులు చేరుకుని ఆమే చెల్లెల్ని కూడ లైంగిక వేధింపులకు గురి చేశారని ఆమే వివరించింది. దీంతోపాటు ఆమే తండ్రిని సైతం బయటికి తీసుకెళ్లి తాళ్లతో కట్టివేశారని పేర్కోంది. అనంతరం ఆయన్ను విపరీతంగా కొట్టారని దీంతో ఆయన కిడ్నికి గాయాలు అయ్యాయని తెలిపింది.