వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉదయం హత్య చేశాడు: ఆ తర్వాత గ్రామస్తుల చేతిలో అంతమయ్యాడు

|
Google Oneindia TeluguNews

లక్నో: సోమవారం ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడ్ని స్థానికులు పట్టలేని ఆగ్రహంతో కొట్టి చంపేశారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ విఫలమయ్యారు. పోలీసుల సమక్షంలోనే జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుషీనగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

మూడుసార్లు ఎమ్మెల్యే దారుణ హత్య: భూ వివాదం కారణం?మూడుసార్లు ఎమ్మెల్యే దారుణ హత్య: భూ వివాదం కారణం?

ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిని నిందితుడు మొదట కాల్చి చంపేశాడు. స్కూటర్‌పై వచ్చిన అతడు వెంటనే కాల్పులు జరిపి అక్కడ్నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇంటిపైకి ఎక్కిన అతడు గాల్లోకి కాల్పులు జరిపాడు. అప్పటికే అక్కడికి భారీగా జనం చేరుకున్నారు.

 UP: Angry mob lynches murder accused in presence of Police personnel

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేటప్పటికీ.. నిందితుడ్ని పట్టుకున్న స్థానికులు అతనిపై ఒక్కసారిగా దాడి చేశారు. దీంతో అతడు కుప్పకూలిపోయాడు. పోలీసులు ముందు లొంగిపోవాలని మొదట నిందితుడు భావించాడు. కానీ, స్థానికులు అతడ్ని పట్టుకుని కర్రలు, రాడ్లతో తీవ్రంగా కొట్టారు.

భారీగా జనం ఉండటంతో పోలీసులు కూడా వారిని అడ్డుకోలేకపోయారు. సోమవారం ఉదయం నిందితుడు గోరఖ్‌పూర్ నుంచి కుషీనగర్‌కు వచ్చి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Aman in Kushinagar area in Uttar Pradesh was lynched by angry villagers after he killed a local inside his house on Monday. The lynching of the murder accused took place in the presence of police personnel who failed to stop the violence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X