సంపర్క్ ఫర్ సమర్థన్: సంజయ్ దత్ను కలిసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
లక్నో: సంపర్క్ ఫర్ సమర్థన్లో భాగంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ను కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నాలుగేళ్ల సాధించిన విజయాలకు సంబంధించిన పుస్తకాన్ని అందించారు.
నరేంద్ర మోడీ నాలుగేళ్లలో సాధించిన విజయాలను ప్రముఖుల వద్దకు తీసుకువెళ్లి వారి మద్దతు కూడగట్టేందుకు బీజేపీ సంపర్క్ ఫర్ సమర్థన్ ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రముఖ ఫిలిం నటుడు, స్క్రీన్ రైటర్ సలీమ్ ఖాన్ను కలిశారు. ఆ సమయంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారు.
బీజేపీ మే 29వ తేదీన సమర్థన్ ఫర్ సంపర్క్ ప్రచారాన్ని ప్రారంభించింది. తొలుత బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ను గురుగ్రాంలోను ఆయన నివాసంలో కలిశారు.
ఆ తర్వాత అమిత్ షా ముంబైలో బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తదితరులను కలిశారు. ఇందులో భాగంగా వారు మోడీ నాలుగేళ్ల పాలనలోని విజయాలకు చెందిన పుస్తకాలు అందిస్తున్నారు.