భారత్-బంగ్లా మ్యాచ్: గుండెపోటుతో మృతి చెందిన అభిమాని
లక్నో: భారత్ - బంగ్లాదేశ్ మధ్య రెండు రోజుల క్రితం జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రేపింది. చివరి ఓవర్లో 11 బంతులు చేయవలసి ఉండగా బంగ్లాదేశ్.. తొలి మూడు బంతుల్లో 9 పరుగులు చేసింది. ఇక చివరి మూడు బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన స్థితిలో.. మూడు వికెట్లు కోల్పోయి ఓడిపోయింది.
ఈ మ్యాచ్ ఉత్కంఠను రేపగా, చివరి ఓవర్కు అయితే అందరి నరాలు బిగుసుకున్నాయి. బంగ్లా గెలుస్తుందని, అదే సమయంలో అద్భుతం జరిగినా ఆశ్చర్యం లేదనే ఉత్కంఠ ఏర్పడింది. చివరి ఓవర్ను చర్చనీయాంశమైంది.
ఇంతటి హైటెన్షన్ మధ్య జరిగిన మ్యాచ్ వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోయాడు. ఇది ఉత్తర ప్రదేశ్లో జరిగింది. ఈ మ్యాచ్ చూస్తున్న యూపీకి చెందిన ఓం ప్రకాశ్ శుక్లా గుండె పోటుకు గురయ్యాడు. వెనువెంటనే ఆసుపత్రికి తరలించారు. అతను మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.
యావత్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసిన ఈ హైటెన్షన్, థ్రిల్లింగ్ మ్యాచ్... ఓం ప్రకాశ్ ఇంట్లో మాత్రం విషాదాన్ని నింపింది. గతంలో ఢిల్లీలో గ్రాసరీ దుకాణం నడిపిన ఇతను, ఆ తర్వాత కుటుంబంతో కలిసి గోరక్పూర్లో సెటిల్ అయ్యాడు. అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు.