UPSC Results:కంబైన్డ్ జియో సైంటిస్ట్ జియాలజిస్ట్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన జియో సైంటిస్ట్, జియాలజిస్ట్ ఫలితాలు 2019 విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఈ ఏడాది జూన్ 28 నుంచి 30 వరకు నిర్వహించింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు నేరుగా యూపీఎస్సీ వెబ్సైట్కు వెళ్లి చూసుకోవచ్చు. (upsc.gov.in). ఈ పరీక్షను క్లియర్ చేసిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మరియు పర్సనాలిటీ టెస్టులకు హాజరుకావాల్సి ఉంటుంది. అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 28 సాయంత్రం 6 గంటల వరకు అధికార వెబ్సైట్లో ఉండే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫారంను పూర్తి చేయాల్సి ఉంటుంది.
2019 జియాలజిస్ట్ ఫలితాలు తెలుసుకోవాలంటే ఇలా చేయాలి:
స్టెప్ 1: అధికార యూపీఎస్సీ వెబ్సైట్కు లాగిన్ అవ్వాలి (upsc.gov.in)
స్టెప్ 2: హోంపేజ్లో వాట్స్ న్యూ అనే దానికింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి
స్టెప్ 3: వెంటనే పీడీఎఫ్ ఫార్మాట్తో ఉన్న ఫలితాల జాబితా కనిపిస్తుంది. రోల్ నెంబర్ ఆధారంగా ఫలితాలు చూసుకోవచ్చు.
ఇక పర్సనాలిటీ టెస్టుకోసం ఈ - కాల్ లెటర్స్ను యూపీఎస్సీ వెబ్సైట్ పై నవంబర్ 29 నుంచి డిసెంబర్ 20 వరకు ఉంచుతారు. వయస్సు, విద్యార్హతలు, కమ్యూనిటీ, ఫిజికల్ డిసేబులిటీలాంటి ఒరిజినల్ సర్టిఫికేట్లను వెరిఫికేషన్కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే పరీక్షలో ఉత్తీర్ణత సాధించని అభ్యర్థుల మార్కుల వివరాలను ఫైనల్ రిజల్ట్ ప్రకటించిన 15 రోజుల్లో వెబ్సైట్పై పెడుతుంది. ఈ మార్కుల వివరాలు దాదాపు 60 రోజుల పాటు వెబ్సైట్ పై ఉంటాయి. అభ్యర్థులు తమ రోల్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయగానే మార్కుల వివరాలు ప్రత్యక్షమవుతాయి.