ఆర్ఎస్ఎస్ను తీవ్రవాద గ్రూప్గా ప్రకటించాలని అడిగే హక్కు లేదు: కోర్టుకు అమెరికా
న్యూయార్క్/న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను విదేశీ తీవ్రవాద సంస్థగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేయాల్సిందిగా అమెరికా ప్రభుత్వం సంబందిత కోర్టును కోరింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జె)కు అలాంటి డిమాండ్ చేసే హక్కు లేనేలేదని స్పష్టం చేసింది.
ఈ మేరకు విదేశాంగమంత్రి జాన్కెర్రీ తరపున న్యాయవాది ప్రీత్ భరారా పిటిషన్ దాఖలు చేస్తూ ఎస్ఎఫ్జె ఫిర్యాదును కొట్టివేయాల్సింది మాన్హాటన్ కోర్టును అభ్యర్థించారు.
సంబంధిత అమెరికా చట్టం కింద ఆర్ఎస్ఎస్ను విదేశీ తీవ్రవాద సంస్థగా ప్రకటించాలంటూ ఎస్ఎఫ్జె కోరిందని, అయితే ఎస్ఎఫ్జెకు గానీ, ఈ న్యాయస్థానానికి గానీ అమెరికా విదేశాంగ మంత్రిపై ఈ మేరకు ప్రకటించేలా ఒత్తిడితెచ్చే అధికారమేదీ లేదని భరారా తెలిపారు.
కాగా, బాబ్రీ మసీదు కూల్చివేత, గోల్డెన్ టెంపుల్లో ఆర్మీ ఆపరేషన్, 2008లో చర్చిపై దాడి, 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఎస్ఎఫ్జె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.