వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: బంధించి రేప్, ఆశ్రమంలో గురువులపై నలుగురు సాధ్వీల ఫిర్యాదు

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లా కేంద్రంలోని ఆశ్రమంలో ప్రధాన గురువు అతని ఇద్దరు అనుచరులు అత్యాచారానికి పాల్పడ్డారని నలుగురు మహిళా భక్తులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీలో ఉన్న ఆశ్రమంలో మహిళా సాధ్వీలపై ప్రధాన గురువు లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితులు ఆరోపించారు. చాలా కాలం నుండి తమపై లైంగిక దాడులకు పాల్పడుతున్నట్టు బాధితులు ఆరోపించారు.నిందితులు పారిపోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్: యువతిని నమ్మించి అత్యాచారం, ఫోటోలతో బ్లాక్‌మెయిల్ ఫేస్‌బుక్ ఫ్రెండ్: యువతిని నమ్మించి అత్యాచారం, ఫోటోలతో బ్లాక్‌మెయిల్

బస్తీ ఆశ్రమంలో గురువుపై లైంగిక వేధింపుల ఆరోపణలు

బస్తీ ఆశ్రమంలో గురువుపై లైంగిక వేధింపుల ఆరోపణలు

బస్తీ ఆశ్రమంలో గురువుపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని అదే ఆశ్రమంలో ఉంటున్న సాధ్వీలు ఆరోపణలు గుప్పించారు. ఓ ఆశ్రమానికి చెందిన బాబా, అతని అనుచరులు తమపై వరుసగా అత్యాచారం జరుపుతూ.. చిత్రహింసలకు గురిచేశారని నలుగురు మహిళా భక్తులు ఆరోపించారు. మంగళవారం ఇద్దరు సాధ్వీలు ఆరోపించగా.. తాజాగా బుధవారం మరో ఇద్దరు సాధ్వీలు పోలీసులను ఆశ్రయించారు.

బంధించి అత్యాచారం

బంధించి అత్యాచారం

ఆశ్రమంలోని ప్రధాన గురువుతో పాటు అతని అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే తాము సహకరించకపోవడంతో
ఆశ్రమంలో బంధించి అత్యాచారం జరిపారని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.బాధితులకు వైద్యపరీక్షలకు పంపినట్టు పోలీసులు తెలిపారు.

ముగ్గురు బాబాలు అత్యాచారం చేశారు

ముగ్గురు బాబాలు అత్యాచారం చేశారు

2008 నుంచి తాము ఆశ్రమంలో నివసిస్తున్నామని సాధ్వీలు తెలిపారు. 'నేను ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చాను. 12 ఏళ్ల వయస్సులో 2008లో నేను ఇక్కడికి వచ్చాను. అమాయకురాలిని కావడంతో నాపట్ల ఏం జరిగిదో తెలిసేది కాదు. నేను నిరాకరించినా ఇక్కడి ముగ్గురు బాబాలు నాపై అత్యాచారం జరిపారు. నన్ను బందీగా ఉంచి.. కొడుతూ,, తరచూ అత్యాచారం జరిపారు' అని ఓ సాధ్వీ తెలిపారు.

పారిపోయిన నిందితులు

పారిపోయిన నిందితులు

అయితే అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఆశ్రమం నుండి పారిపోయారు. నిందితుల కోసం గాలింపు చర్యలను చేపట్టినట్టు బస్తీ జిల్లా ఎస్పీ సంకల్ప్‌ శర్మ తెలిపారు. అయితే ఈ నిందితులు పట్టుబడితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు.

English summary
4 women devotees of an Ashram in Basti leveled allegations against a Baba Sachidanand of the ashram and his two aides for raping and torturing them repeatedly, accused absconding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X