రోడ్డు పక్కన కాలిన గాయాలతో..నగ్నంగా డిగ్రీ విద్యార్థిని
లక్నో: ఉత్తర ప్రదేశ్లో మరో దారుణ ఘటన సంభవించింది. ఉన్నవ్లో ఇద్దరు బాలికలు మృతదేహాలుగా కనిపించిన సంఘటనను విస్మరించక ముందే.. అలాంటి ఉదంతమే మరొకటి. ఓ యువతి జాతీయ రహదారి పక్కన కాలిన గాయాలతో, నగ్నంగా పడి ఉన్న సంఘటన షాజహాన్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. లక్నో-ఢిల్లీ జాతీయ రహదారి పక్కన స్పృహ తప్పిన స్థితిలో కనిపించిన ఆ యువతిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స కోసం ఆమెను తొలుత లక్నోలని కింగ్జార్జ్ మెడికల్ యూనివర్శిటీ, అనంతరం శ్యామాప్రసాద్ ముఖర్జీ సివిల్ హాస్పిటల్కు తరలించారు.
జలాలాబాద్కు చెందిన బాధితురాలు స్వామి సుఖ్దేవానంద్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నట్లు గుర్తించారు. ఈ కళాశాల..కేంద్ర మాజీమంత్రి స్వామి చిన్మయానంద్ ట్రస్ట్కు చెందినది. తన తండ్రితో పాటు ఇంటి నుంచి కళాశాలకు బయలుదేరి వెళ్లిన ఆమె.. మళ్లీ తిరిగి రాలేదు. సాయంత్రమైనప్పటికీ.. కుమార్తె ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు అన్ని చోట్లా వెదికారు. ఆమె ఆచూకీ తెలియరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల గాలింపుల్లో.. నగారియా మోడ్ ప్రాంతంలో లక్నో-ఢిల్లీ జాతీయ రహదారి పక్కన నగ్నంగా.. కాలిన గాయాలతో బాధితురాలు స్పృహ తప్పిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. సుమారు 60 శాతం మేర కాలిన గాయాలైనట్లు కింగ్జార్జ్ మెడికల్ యూనివర్శిటీ డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు షాజహాన్పూర్ ఎస్ఎస్పీ ఎస్ ఆనంద్ తెలిపారు. ఈ ఘటన చోటుచేసుకోవడానికి గల కారణాల గురించి అన్వేషిస్తున్నామని అన్నారు. తండ్రి ఆమెన కళాశాల వదిలేసిన తరువాత ఆమెకు ఏం జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నామని చెప్పారు.