ఎంపీ ఆజాం ఖాన్పై దోంగతనం కేసు, పుస్తకాలు, విగ్రహాలు ఎత్తుకెళ్లాడని ఆరోపణ...!
వివాదస్పద ఎంపీ అజాంఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన ప్రోత్సహాంతో లైబ్రరీ పుస్తకాలతోపాటు రాంపూర్ క్లబ్లో రెండు సింహాల విగ్రహాలను దొంగతనం చేశాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎంపీ ప్రోద్బలంతో ఎత్తుకెళ్లిన విగ్రహాలను మౌలాన ఆలీ జవహార్ యూనివర్శిటీలో ఏర్పాటు చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కోన్నారు.
ఇటివల పార్లమెంట్ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లోక్సభ నియోజకవర్గ ఎంపీ ఆజాంఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. స్థానిక రాంపూర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై దోంగతనం కేసు నమోదైంది. దీంతోపాటు 2000 వేల పురాతన గ్రంధాలను రాంపూర్లోని ఆలీయా మదర్సా నుండి ఎత్తుకెళ్లాడని మరోకేసు నమోదైంది.
కాగా రాంపూర్ ఎస్పీ ఎత్తుకెళ్లిన గ్రంధాలను మౌలాన ఆలీ యూనివర్సిటి నుండి రికవరీ చేశామని మీడీయాతో చెప్పాడు. కాగా ఆజాం ఖాన్ మౌలాన ఆలీ జవహర్ యూనివర్సిటి ఫౌండర్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు. కాగా ఇటివల పోలీసులు ఎంపీ ఆజాంఖాన్ పై ల్యాండ్ గ్రాబింగ్తో ఇతర కేసులపై నిఘా పెట్టారు. అయితే బీజేపీ అభ్యర్ధి జయప్రదను ఓడించడం వల్లే కేంద్రం తనపై కక్ష కట్టిందని ఆజాం ఖాన్ ఆరోపణలు చేశాడు.