పోలీసులా, మజాకా.. యువకుడిని చితకబాది.. వైరల్ వీడియో
లక్నో : పోలీసులా, మజాకా అనే స్టైల్లో ఖాకీలు రెచ్చిపోయారు. ఓ యువకుడిని ఇష్టమొచ్చినట్లుగా చితకబాదారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడనే నెపంతో తీవ్రంగా కొట్టారు. వాహనదారులపై చేయి చేసుకోవద్దనే నిబంధనలకు తూట్లు పొడిచి మరీ చావగొట్టారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థ నగర్ జిల్లాలో గురువారం నాడు పోలీసులు రెచ్చిపోయారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడని ఓ యువకుడిని చితకబాదారు. రింకీ పాండే అనే యువకుడు చిన్న పిల్లాడితో కలిసి తన బైకుపై వెళుతున్న క్రమంలో ఎస్సై వీరేందర్, హెడ్ కానిస్టేబుల్ మహేందర్ ప్రసాద్ అతడిని ఆపారు. డ్రైవింగ్ లైసెన్స్, బైక్ పేపర్లు చూపించాలని అడిగారు. ఆ క్రమంలో పోలీసులకు, ఆ యువకుడి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
రింకీ పాండేతో మాట్లాడుతున్న సమయంలో బైక్ తాళాలు లాక్కునే ప్రయత్నం చేశారు పోలీసులు. దాంతో తాళాలు ఇవ్వడానికి సదరు యువకుడు నిరాకరించాడు. ఆ క్రమంలో రెచ్చిపోయిన పోలీసులు అతడిని ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. కింద పడేసి కాళ్లతో తన్నారు. కొద్దిసేపు ఆ యువకుడికి నరకమేంటో చూపించారు. ఆ దెబ్బలు తాళలేక.. తాను చేసింది తప్పయితే జైల్లో వేయాలని కోరాడు. అయినా కూడా పోలీసులు కనికరించలేదు.
ఆ టీఆర్ఎస్ నేతలు అటు వైపుగా.. కారు జోరుకు బ్రేకులేనా.. ఆ ప్రచారంలో నిజమెంత?
బైకు తాళాలు లాక్కునే ప్రయత్నంలో ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించిన పాపానికి ఆ యువకుడిని తీవ్రంగా కొట్టారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై సంబంధింత ఉన్నతాధికారులు స్పందించారు. సదరు యువకుడిని చితకబాదిన ఆ ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసి డిపార్టుమెంటల్ విచారణకు ఆదేశించారు.
#WATCH: Man thrashed by two police personnel in Siddharthnagar over alleged traffic violation. UP Police have taken cognisance of the incident and suspended the two police personnel. (Viral video) pic.twitter.com/0dWvnSV0lL
— ANI UP (@ANINewsUP) September 13, 2019